మ‌హేష్ బాబు స‌ర‌స‌న రష్మిక హీరోయిన్ గా ఎంపిక అయింది అన్నవార్తలు రాగానే  ఆమె ఎంతగానో ఎగ్జైట్  అయింది. ఆమెకు తెలుగులో అవ‌కాశం ఇచ్చిన‌ తొలి బ‌డా స్టార్ హీరో మ‌హేష్ కావడంతో అతడికి విపరీతమైన కృతజ్ఞతలు తెలియ చేసింది. అయితే ఇప్పుడు ఆమెకు ఆ ఆనందం ఎక్కువకాలం కొనసాగా లేదు సరికదా ఇప్పడు ఆమె పై ఆమె అభిమానులు కూడ జాలి చూపించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇప్పటి వరకు తెలుగులో రష్మిక నటించిన సినిమాలు అన్నింటిలోను ఆమెకు మంచి పాత్రలు క్రియేట్ చేయబడ్డాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘సరిలేరు నీకెవ్వరు’ కథ అంతా మ‌హేష్ చుట్టూనే తిరుగుతుంది. మహేష్ తరువాత ఆ ప్రాధాన్యత  విజ‌య‌శాంతికి దక్కింది.  

దీనితో ఇప్పటివరకు ఈసినిమాకు సంబంధించిన ప్రోమోలు పాటలు టీజర్లు అన్నింటిలోను మహేష్ తో పాటు విజయశాంతికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ గా రష్మిక మహేష్రొమాంటిక్ లుక్ కు సంబంధించి రెండు స్టిల్స్ విడుదల చేసినా వాటికి చెప్పుకోతగ్గ క్రేజ్ ఏర్పడలేదు. దీనితో ఆమె క‌నిపించే పాట ఒక్క‌టైనా రిలీజ్  చేయకపోవడంతో రష్మిక  ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు. 

ఇలాంటి టైమ్ లో ‘హీ ఈజ్ సో క్యూట్’ అంటూ ఒక పాట తాలూకు ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. సోమ‌వారం దీని ఫుల్ సాంగ్ రిలీజ‌వుతోంది. ఈలోపు ర‌ష్మిక‌తో ఈ పాట‌పై టిక్ టాక్ వీడియోను విడుదల చేసారు. అందులో  ఆమె హుషారుగా స్టెప్పులు వేస్తూ తనవంతుగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్ కు సహకరించింది. అయితే ఈ టిక్ టాక్ వీడియో చూసి కొంతమంది మ‌రీ చీప్‌గా ఆమెతో టిక్ టాక్ వీడియోలో స్టెప్పులేయించి ప్రోమో వ‌ద‌ల‌డం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు తాను టాప్ హీరోయిన్‌ రేంజ్ లో కొనసాగుతున్నాను అన్న విషయం మరిచిపోయి ఇలా తనకు అవకాశం ఇచ్చిన మహేష్ కు కృతజ్ఞతలు తెలియచేసుకోవడానికి మరీ ఇంత దిగజారి పోవాలా అంటూ జోక్ చేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: