టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ డి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్ ’ మూవీతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.  ఈ మూవీ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  దాంతో బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సెకండ్ హీరోగా నటించాడు.  హీరోగానే నటించాలనే ఉద్దేశం లేదని.. ఎలాంటి క్యారెక్టర్ అయినా రానా గుర్తుండి పోయేలా ఉండేలా చూసుకుంటానని ఒకానొక సందర్భంలో చెప్పాడు.  అలాగే రానా ఏ పాత్రకైనా సై అంటూ నటిస్తున్నాడు.  ఈ నేపథ్యంలో రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి, బాహుబలి2’.  ఈ మూవీలో రానా విలన్ గా తన విశ్వరూపాన్ని చూపించాడు.  ప్రభాస్ బాహుబలిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. రానా, భళ్లాలదేవుడిగా అంతే పేరు తెచ్చుకున్నాడు. 

 

ఆ తర్వాత తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రితో మరోవిజయం అందుకున్నాడు. బాహుబ‌లి చిత్రంతో దేశ‌వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన న‌టుడు రానా ద‌గ్గుబాటి. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న రానా తెలుగులో విరాట‌ప‌ర్వం అనే సినిమా చేస్తున్నాడు.నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల మూవీకి దర్శత్వం వహిస్తున్నాడు.ఇక ఈ రోజు రానా బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ విరాటపర్వం నుండి రానా ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. నీదినాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

 

ఈ మూవీలో  ఆమె నక్సలైట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇందులో రానా ముఖానికి ఎర్ర‌టి క్లాత్ క‌ట్టుకున్నాడు. వెనుక తుపాకులు జెండాలు ప‌ట్టుకొని ప‌లువురు సైనికులు ఉరుకొస్తున్నారు. ఇక పోస్ట‌ర్‌పై విప్ల‌వం అనేది ప్రేమ‌తో కూడుకున్న చ‌ర్య అని రాసి ఉంది. తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ ఈ మూవీలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: