టెలివిజన్ రంగంలో యాంకరింగ్ లో తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి తన వాస్తవ నిజజీవితంలో 45 లక్షల పోగొట్టుకున్న సంఘటన గురించి ఇటీవల తాను సపరేట్ గా క్రియేట్ చేసుకున్న తన యూట్యూబ్ ఛానల్ లో తెలపడం జరిగింది. ఇదే క్రమంలో యాంకర్ శ్రీముఖి పై తనపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. అప్పట్లో కామెడీ షో పటాస్ షో లో యాంకరింగ్ గా రవి మరియు శ్రీముఖి చేసేవాళ్ళు షో కి అద్భుతమైన ఆదరణ వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీముఖి పటాస్ షో నుండి బయటకు వెళ్ళిపోవడం తో….. యాంకర్ రవితో గొడవ మూలంగా శ్రీముఖి షో నుండి బయటికి వెళ్లి పోయిందని అప్పట్లో వార్తలు రావడం జరిగాయి. ఇదే తరుణంలో ఆమెకు బిగ్ బాస్ షో నుండి పిలుపు రావడంతో బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ గొడవ పై తనపై శ్రీముఖి పై వస్తున్న వార్తలపై యాంకర్ రవి మాట్లాడుతూ… శ్రీముఖి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ఎవరికైనా కెరీర్లో బెస్ట్ ఆఫర్ వస్తే కచ్చితంగా ఉన్న దాన్ని వదులుకొని వెళ్ళటం తప్పనిసరి అని శ్రీముఖి అదే చేసిందని నాకు శ్రీముఖికి ఎలాంటి గొడవలు లేవని ఆమె మంచి కో యాంకర్ అని రవి పేర్కొన్నాడు. ఇదే తరుణంలో తాను పటాస్ షో నుండి బయటకు రావటానికి గల కారణం వ్యక్తిగత సమస్యలు అంటూ యాంకర్ రవి తెలిపారు. ఇదిలా ఉండగా తన పర్సనల్ లైఫ్ లో స్నేహితుడు అని నమ్మి 45 లక్షల డబ్బులు పోగొట్టుకున్న సంఘటన గురించి యాంకర్ రవి తెలిపారు.

 

అప్పట్లో తనతో రెండేళ్లు కలిసున్న ఓ స్నేహితుడు నమ్మించి మోసం చేసాడని, 45 లక్షలు కాజేసాడని చెప్పుకొచ్చాడు. 20 రోజుల్లో ఇస్తానని చెబితే నోటి మాట మీదా ఎలాంటి పత్రం లేకుండా 45 లక్షల రూపాయలు ఇచ్చానని, కానీ రెండేళ్లైనా ఇవ్వడం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనిపైన లీగల్ పోరాటం చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం రవి ప్రస్తావించలేదు. అంతేకాకుండా ఇప్పటిదాకా యాంకరింగ్ చేసి వచ్చిన డబ్బులు మొత్తం కుటుంబానికి ఖర్చుపెట్టినట్లు ఆస్తులు ఏమి సంపాదించుకో లేదని కానీ త్వరలోనే నిర్మాతగా ఓషో యాంకర్ రవి ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవన్నీ పుకార్లేనని నా దగ్గర అంత డబ్బు లేదని రవి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం జీ తెలుగులో ఓషో చేస్తున్నట్టు రవి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: