బాలీవుడ్ లోనైనా, టాలీవుడ్ లో అయినా.. వయసు పై బడ్డ స్టార్ హీరోలు తమ కూతుర్ల వయసున్న ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడమనేది సహజం. అయితే ఈ విషయాన్నే ఉద్దేశిస్తూ దబాంగ్ నటి సోనాక్షి సిన్హా ఒక ఇంటర్వ్యూ లో సంచనల వ్యాఖ్యలను చేసింది.

ఇంతకీ తను ఏం చెప్పిందంటే... 'నాకు యాభై ఏళ్లు వస్తే.. ఇరవై రెండేళ్ల కుర్రాళ్లతో రొమాన్స్ చేయను' అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అయితే యాభై ఐదేళ్ల హీరోలు, ఇరవై రెండేళ్ల హీరోయిన్స్ తో నటిస్తుండటాన్ని ఉద్దేశించి సోనాక్షి ఇలా అన్నదని తెలుస్తుంది. 4 రోజుల క్రితం ఈమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయం టాలీవుడ్ హీరో బాలకృష్ణకు కూడా తెలిసిందేమో.. అందుకే వెంటనే ఆమెను సంప్రదించి... '55 ఏళ్ల హీరోస్ తో నటించవా నువ్వు?' అని అడిగినట్లు సమాచారం.

ఆ తరువాత ఏం జరిగిందో కానీ.. సోనాక్షి మాత్రం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న రూలర్ సినిమాలో నటిస్తుందనే టాక్ గట్టిగ వినిపిస్తుంది. కాగా, మరొక బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. ఇకపోతే.. జబర్దస్త్ భామ రష్మి గౌతమ్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర లో నటిస్తుంది.

బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చినా.. అది మంచి విజయం సాధిస్తుంది. దీంతో రూలర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే... ఈ సినిమా నుంచి బాలకృష్ణ లుక్స్ విడుదలై దుమారం రేపిన సంగతి విదితమే. ఈ చిత్రంలో నటిస్తున్న బాలకృష్ణ 10కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటుండగా... మాస్ డైరెక్టర్ బోయపాటి రూ.15కోట్లు తీసుకుంటున్నారట. ప్రస్తుతం సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ 3 చిత్రంలో నటిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: