రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన చిత్రం 'వెంకీమామ'. ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత‌ ఇటు వెంకటేష్.. మజిలీ హిట్ తర్వాత అటు నాగ చైత‌న క‌లిసి న‌టించిన వెంకీ మామ సినిమా సినిమాకు బాబీ దర్శకత్వం వ‌హించాడు. అక్కినేని, దగ్గుబాటి అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలైన 'వెంకీమామ' సినిమా ప్రపంచవ్యాప్తంగా సందడి చేసింది. హిలేరియస్ కామెడీతో ప్రేక్షకలోకాన్ని నవ్వుల్లో ముంచెత్తాడు. ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ ఎమోషన్‌తో ప్రేక్షకులను అలరించారు మామాఅల్లుళ్లు. అలాగే ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా వెంకీ మామ స‌త్తా చాటింది.

 

ఇదిలా ఉంటే.. నాగ చైతన్య 20వ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గీతా గోవిందం చిత్రంతో హిట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన పరశురాం తన తదుపరి సినిమాపై అనేక వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్యా కాలంలో మహేష్‌, అల్లు అర్జున్, అఖిల్‌లలో ఒకరితో పరశురాం సినిమా ఉంటుందని విసృతంగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ.. అక్కినేని హీరో నాగచైతన్యతో సినిమా చేయబోతున్నాడు. 14రీల్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ ప్రకటన ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ. మరి కొద్ది రోజులలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.  ఫుల్ స్క్రిప్ట్ పూర్తవ్వగానే ప్రీ ప్రొడక్షన్ పనులు మొద‌లుకానున్నాయి.

 

ఇక మ‌రోవైపు..  నాగ చైతన్య  ఇప్పటికే తన తర్వాతి సినిమాను మొదలుపెట్టేసిన సంగతి తెల్సిందే. సాయి పల్లవి హీరోయిన్ గా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తున్న సినిమా అప్పుడే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.  హైదరాబాద్‌లో లాంఛనంగా చిత్రీకరణ మొదలైంది.  వాస్త‌వానికి ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. అయితే ఇంత టైమ్ గ్యాప్ త‌ర్వాత నాగ చైత‌న్య హీరోగా ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాను నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన ఏషియన్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: