క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణ వంశీ నక్షత్రం డిజాస్టర్ తర్వాత పట్టాలెక్కిస్తున్న సినిమా "రంగమార్తాండ" మరాఠీ సినిమా అయిన నట సామ్రాట్ కి ఇది రీమేక్. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి తగ్గట్లుగా క్రిష్ణ వమ్శీ తెరకెక్కిస్తున్నాడట. అయితే క్రిష్ణవంశీ ఫ్యామిలో సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్. ఆయన రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన వర్మా లాంటి అండర్ వరల్డ్ సినిమాల జోలికి పోకుండా తనదైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు.

 

అయితే గత కొద్ది రోజులుగా క్రిష్ణవంశీ తడబడుతున్నాడు. ఆయన తీసే సినిమాలు చాలా నాసిరకంగా ఉన్నాయి.  ఆయన గత చిత్రం "నక్షత్రం" గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే క్రిష్ణ వంశీ ఈ సారి రీమేక్ తో వస్తున్నాడు. ఈ చిత్రంలో రమ్య క్రిష్ణ, మరియు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలుగా ఉన్నారు. ఇంకా బ్రహ్మానందం లాంటి నటులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మొదలయింది.

 

 

మరాఠీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను క్రిష్ణవంశీ తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అదీగాక చాలా రోజుల తర్వాత రమ్యక్రిష్ణ క్రిష్ణ వంశీ సినిమాలో నటించడం మరో ఆసక్తికర అంశం. రమ్య క్రిష్ణ, ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ లో వచ్చిన చాలా చిత్రాలు మంచి విజయం సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా విజయవంతం అవుతుంద అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రకాష్ రాజ్ ఎక్కువగా కలుగజేసుకుంటున్నాడట.

 

ప్రకాష్ రాజ్ నటిస్తూనే స్క్రిప్ట్ విషయంలో మరియు స్క్రీన్ ప్లే విషయంలో ఒక సహాయ దర్శకుడి మాదిరి గా కృష్ణవంశీ కి హెల్ప్ చేస్తున్నాడట. సినిమా కథ బాగా నచ్చడంతోనే ప్రకాష్ రాజ్ తనదైన ఇన్ ఫుట్స్ ఇస్తున్నాడట. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ చిత్రం వేసవిలో విడుదల అవుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: