టాలీవుడ్ లోకి జోష్ సినిమాతో ఎంతో జోష్ గా వచ్చాడు.. స్టార్ హీరో కింగ్ నాగార్జున తనయుడు నాగ చైతన్య.  అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.  ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేసావే’ మూవీలో నటించాడు.  ఈ మూవీలో సమంత హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది..అంతే కాదు ఈ మూవీతోనే చైతూ-సమంత ప్రేమలో పడ్డారు.  మనం సినిమా తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.   నాగ చైతన్య కెరీర్ మొదలు పెట్టి ఇప్పటికీ పదేళ్లు అవుతుంది.   అయితే చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా మాత్రం లేదు.  ఈ మద్య సమంతతో కలిసి నటించిన ‘మజిలీ’ మంచి హిట్ టాక్ వచ్చింది.  తాజాగా విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య మల్టీస్టారర్ గా బాబీ దర్శకత్వంలో ‘వెంకిమామ’ నిన్న రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా కి మంచి టాక్ వచ్చింది.  

 

ఈ మూవీలో వెంకటేష్ పాత్రకు మంచి ఆదరణ లభించిందని.. చైతూ తన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడని టాక్ వచ్చింది.  ఇక విజయ్ దేవరకొండకు ‘గీతా గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన పరుశరామ్ తర్వాత ఏ సినిమా కూడా తీయలేదు. ఆ మధ్య మహేష్‌, అల్లు అర్జున్, అఖిల్‌లలో ఒకరితో పరశురాం సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కాని ఆ ప్రచారాలని తలకిందులు చేస్తూ అక్కినేని హీరో నాగచైతన్యతో సినిమా చేయబోతున్నాడు. మహేష్ బాబుతో సినిమా కోసం చాలా ప్రయత్నాలే చేశాడు. ఒక దశలో మహేష్‌తో ప్రాజెక్ట్ ఓకె అయినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఫైనల్‌ కాలేదు. తాజాగా  14రీల్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ ప్రకటన ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ.

 

మరి కొద్ది రోజులలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. నాగ చైతన్య రీసెంట్‌గా వెంకీ మామ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లవర్స్ అనే పేరుతో ఈ సినిమా ప్రచారం జరుపుకుంటుంది. కాగా, పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న నాగచైతన్య 20వ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఇటీవల మజిలీ ఘన విజయం అందుకున్న నాగచైతన్య తాజాగా వెంకీ మామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కూడా పాజిటివ్‌ టాక్‌ రావటంతో తదుపరి చిత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: