టాలీవుడ్ పరిశ్రమలో వారసత్వం కొనసాగుతోందని మనందరికీ తెలిసిన విషయమే. కిందటి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరి వారసులు కూడా తర్వాతి తరంలో సూపర్ స్టార్స్ గా వెలిగారు.ఇప్పుడు వారి కుమారులు కూడా నట ప్రవేశం చేశారు. సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున టాలీవుడ్ పరిశ్రమను తమ భుజాలపై బలమైన పునాది వేసుకున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వారసులు పరిశ్రమలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ సూపర్ స్టార్ అయ్యాడు ఇప్పుడు. అలాగే నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా మంచి సినిమాలు తీస్తున్నారు.

 

అయితే బాలకృష్ణ, వెంకటేష్ వంటి తారలు తమ వారసుల ప్రవేశంపై గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. బాలకృష్ణ, వెంకటేష్ వారసులు తమ ప్రవేశాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే సందేహాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. బాలకృష్ణ కుమారుడు మోక్షగ్న తెరపైకి రావడం గురించి చాలా రోజుల నుంచి చర్చనీయాంశమైంది. మోక్షగ్న లీకైన ఫోటోలను చూసిన నందమూరి అభిమానులు తనకు హీరో లుక్స్ లేవని భావించారు. మోక్షాగ్నకు సినీ కెరీర్‌పై ఆసక్తి లేదని, ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారని వార్తలు వస్తున్నాయి

 

మరొక వైపు వెంకటేష్ కుమారుడు అర్జున్ ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతను సినిమాల్లోకి ప్రవేశించడం గురించి ఇప్పటికే ఊహహాగానాలు ఉన్నాయి. అర్జున్ వెండితెరపై తన ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాడట. అతను ప్రస్తుతం నటనపై ఆసక్తి చూపలేదు అని తెలుస్తుంది. వెంకటేష్ ఒత్తిడి చేయటం లేదు అలాగే తన కొడుకు తన సొంత నిర్ణయం తీసుకోమని ప్రోత్సహిస్తూ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

 

బాలకృష్ణ, వెంకటేష్ సీనియర్ స్టార్స్ కాబట్టి, వారి వారసుల అరంగేట్రంపై అభిమానుల నుంచి స్టార్స్ కి ఒత్తిడి పెరుగుతోంది. దగ్గూబాటి, నందమూరి కుటుంబం వెండితెరపై ప్రవేశించడంపై స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానులు ఉద్రిక్తత క్షణాలను ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: