సహాయ దర్శకుడిగా సిని కెరీర్ మొదలుపెట్టి నేడు అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందుతున్న న్యాచురల్ స్టార్ నానీ క్రేజ్ అంతా ఇంతా కాదు... వరుస విజయాలతో వరుస సినిమాలతో ఈ హీరో దూసుకుపోతున్నాడు. దాదాపు సినిమాలు అన్నీ విజయాలు సాధించడంతో అతని మార్కెట్ కూడా క్రమంగా పెరిగింది. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత అతనితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపించారు. అయితే ఇప్పుడు నానీ విషయంలో మాత్రం హీరోయిన్లు వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు.

 

అతనితో నటించేందుకు గాను చాలా మంది హీరోయిన్లు ఇష్టపడటం లేదనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. సాయి పల్లవి తో నానీ ఎంసీఏ సినిమాలో నటించాడు. ఈ సినిమా సమయంలో సాయి పల్లవికి నానీ కి మధ్య వివాదం తలెత్తింద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ తర్వాత ఆ సినిమా నిర్మాత దిల్ రాజు జోక్యం చేసుకుని గొడవను ముగించార‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు గుస‌గుస‌లాడుకున్నారు. ఆ తర్వాత ఆమె తెలుగులో సినిమా అవకాశాలు వచ్చినా సరే పెద్దగా చేయడానికి ఇస్తాపడలేదనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు ఆమె దాదాపు తెలుగు సినిమాలకు దూరంగా ఉంది.

 

ఇప్పుడు ఈ జాబితాలో... మరి కొంత మంది హీరోయిన్లు ఉన్నట్టు సమాచారం... కీర్తి సురేష్ ని ఇటీవల నానీతో నటించమని అడగగా ఆమె అంత ఆసక్తి చూపించలేదని... తనకు వద్దని చెప్పినట్టు తెలుస్తుంది. అదే విధంగా మరో మలయాళం హీరోయిన్ కూడా నానీతో సినిమా చేయలేను అని చెప్పినట్టు సమాచారం. దీనికి కారణం నానీ వ్యవహారశైలే అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు.

 

శ్రీరెడ్డి వ్యవహారం తర్వాత నానీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, అలాగే తన ఇమేజ్ మీద మచ్చపడింది అనే భావనలో ఉన్న నానీ... హీరోయిన్లతో కాస్త దురుసుగా వెళుతున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వ‌స్తున్నాయి. అది ఒకటి అయితే తాను షూటింగ్ కి కుదిరినప్పుడు వస్తాను అనే విధంగా వ్యవహరిస్తూ  హీరోయిన్లు కూడా అప్పుడే డేట్స్ చూసుకోవాలన్నట్టు చెప్పినట్టు తెలుస్తుంది. మ‌రి ఓ యంగ్ హీరోపై ఇలాంటి రూమ‌ర్లు ఎందుకు వ‌స్తున్నాయి.. ఆయ‌న ఎక్క‌డ మిస్టేక్ చేస్తున్నారో ?  ఆలోచించుకుని కెరీర్‌ను స‌రైన మార్గంలో చ‌క్క‌దిద్దుకుంటే మంచిద‌న్న అభిప్రాయం సర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: