నిజ జీవితంలో మామా అల్లుళ్ళైన వెంకటేష్-నాగ చైతన్య కలిసి నటించిన సినిమా వెంకీ మామ. బాబి దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించారు. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అంతేకాదు సక్సస్ ఫుల్ గా రన్నవుతోంది కూడా. అయితే ఒక విషయం మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండే కాదు ప్రేక్షకుల్లోను విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా నాగచైతన్య తమ బ్యానర్లో చేసిన సినిమాలకైనా వేరే బ్యానర్లలో పని చేసే సినిమాలకైనా తండ్రిగా బాధ్యత వహిస్తూ ప్రమోషన్‌ చేస్తుంటాడు నాగార్జున. చైతన్య అనే కాదు అక్కినేని ఫ్యామిలీలో ఎవరి సినిమాకి అయినా నాగార్జున సపోర్ట్ ఫుల్‌గా వుంటుంది.

 

ఇక సమంత నటించే సినిమాలకి కూడా నాగార్జున ప్రమోషన్‌ విపరీతంగా చేస్తుంటారు. అలాంటిది చైతన్య మొదటిసారిగా తన మేనమామ వెంకటేష్‌తో కలిసి నటించిన సినిమా గురించి నాగార్జున మాట వరసకి కూడా ఏమీ అనడం లేదు. అసలు ఈ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. వేరే చిత్రాల గురించి ట్వీట్లు పెడుతోన్న నాగార్జున తను ఇలా 'వెంకీ మామ' పట్ల మౌనంగా వుంటే మీడియాలో ఏమి రాస్తారనేది కూడా లేకుండా ఈ సినిమా గురించి అస్సలేమీ మాట్లాడడం లేదు.

 

వెంకటేష్‌తో నాగార్జునకి రిలేషన్‌ అయితే బాగానే వుంది. సురేష్‌బాబుతో కూడా నాగ్‌కి ఎలాంటి సమస్యలు లేవు. మరెందుకని 'వెంకీమామ' విషయంలో నాగ్‌ మౌనంగా ఉన్నాడని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదిలావుంటే ఈ సినిమాలో వెంకీ, చై కలిసి నటించినా కానీ వారి ఇరువురి అభిమానులు మాత్రం మామా అల్లుళ్లని కలిపి ఒక్కటిగా చూడడం లేదు. వెంకీ మామకి బాగా క్లోజ్‌ అయిన చైతన్యని దగ్గుబాటి ఫాన్స్‌ ఓన్‌ చేసుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. దగ్గుబాటి అభిమానులకి ఎలాగో అక్కినేని హీరోలంటే అంతగా పడదన్న టాక్ ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. మరి నాగ్ ఇప్పటికైనా స్పందిస్తారా లేదా చూడాలి. ఇక వెంకటేష్సినిమా తర్వాత కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా అసురన్ లో నటించబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మరో వైపు చైతూ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో చైతూకి జోడీగా నటిస్తున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: