టాలీవుడ్ లో ఈ మద్య విక్టరీ వెంకటేష్ ఎక్కువగా మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాన్, రామ్ ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2 ’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  నిన్న వెంకటేష్ - నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘వెంకిమామ’ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు.  ఈ సినిమాలో వెంకటేశ్‌కు జంటగా పాయల్‌ రాజ్‌పుత్‌ కనిపించగా.. చైతూకు జంటగా రాశీఖన్నా నటించారు. ఇందులో వెంకీ-చై మామా అల్లుళ్లగా నటించారు.

 

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరు మామా అల్లుళ్లు కావడం విశేషం.  తాజాగా ఈ మూవీ విజయంపై పలువురు సెలబ్రెటీలు చిత్ర యూనిట్ కి ప్రత్యేకంగా మామా అల్లుళ్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.  విడుదలైన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. విలేజ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ పాజటివ్ టాక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా చిత్రబృందాన్ని అభినందించాడు. . ‘‘వెంకీమామ’.. మాస్‌ విలేజ్‌ ఫన్‌. వెంకటేశ్‌ గారు, చైతూ నటన సూపర్‌గా ఉంది.

 

మామా అల్లుళ్లు అదరగొట్టారు. గుడ్‌ వర్క్ బాబీ డార్లింగ్‌. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’ అని అనిల్‌ పేర్కొన్నారు.  ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్‌ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. విజయశాంతి, ప్రకాశ్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. జనవరి11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: