టాలీవుడ్‌ యంగ్ అండ్ డైనమిక్ హీరో రానా దగ్గుబాటి భారీ ప్లాన్‌లో ఉన్నాడని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రానా, ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న రానా త్వరలో ఓ భారీ సినిమాని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తరువాత రానా ఇంతవరకు మళ్ళీ ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ సినిమాలో చంద్రబాబు పాత్రలో కనిపించిన రానా, ఆ పాత్రలో చాలా సన్నగా కనిపించాడు. అయితే ముందుగా క్యారెక్టర్‌ కోసమే రానా బరువు తగ్గాడని భావించినా, తరువాత ఆరోగ్యం సరిగాలేదన్న వార్తలు రావటంతో తన ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తలను రానా ఖండించాడు. 

 

ఇక రానా సినిమాల విషయంలో స్పీడు పెంచాడు. కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య షూటింగ్ పూర్తి చేసిన రానా, తాజాగా తన నెక్ట్స్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రివీల్ చేశాడు. రానా పుట్టిన రోజు సందర్భంగా విరాట పర్వం సినిమాలోని రానా లుక్‌ని రివీల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో సినిమా కంటెంట్‌ ఎలా ఉండబోతుందో కూడా హింట్‌ ఇచ్చారు. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి రానాకి జోడిగా నటిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో సాయి పల్లవి నక్సలైట్‌ పాత్రలో నటిస్తుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.

 

బెల్లి లలిత జీవిత కథ ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారన్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో సాయి పల్లవి డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించనుందట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్‌ బాబు, సుధాకర్‌ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. జూన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తయ్యిందని తాజా సమాచారం. మధ్యలో రానా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇవ్వటంతో సినిమా ఆలస్యమైంది. ఇటీవల రానా తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుండటంతో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: