వైజాగ్ లో జరుగుతున్న బాలకృష్ణ 'రూలర్' సినిమా ప్రీ రేలీజ్ వేడుక గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉండడం విశేషం .. బాలయ్య తన సరికొత్త సినిమా తో ఎలా కనిపిస్తాడు అని తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పోలిటికల్ గా టీడీపీ డౌన్ ఐన తరవాత బాలకృష్ణ నుంచి వస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం, ఎలక్షన్ టైమ్ లో కథా నాయకుడు, ప్రజా నాయకుడు అంటూ తన తండ్రి , ఆంధ్రులు దైవంగా కొలిచే సీనియర్ ఎన్‌టి‌ఆర్ బయోపిక్ తీసి ఇబ్బంది పడడం అందరూ చూసిన తరుణం లో బాలకృష్ణ కొత్త సినిమా మీద రకరకాల మాటలు వినపడుతూ ఉన్నాయి. కె యెస్ రవికుమార్ దర్శకత్వం లో పోలీస్ ఆఫీసర్ గా తెరమీద బాలయ్యని చూడడం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

 

ప్రీ రేలీజ్ ఫంక్షన్ కూడా ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అతిరథ మహారథుల సమక్షం లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది .. ఇలాంటి పరిస్తితి లో రూలర్ సినిమా ప్రీ రేలీజ్ ఫంక్షన్ కి గంటా శ్రీనివాసరావు రావడం గురించి పోలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త చర్చ నడుస్తోంది. ఈ మధ్య కాలం లో గంటా శ్రీనివాసరావు టీడీపీ తో సరిగ్గా లేరు అంటూ ఇంటర్నెట్ లో వార్తలు నడుస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ మారడం మాజీమంత్రి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కొత్తేమీ కాదు. ఇప్పటికే మూడు సార్లు పార్టీ మారిన గంటా శ్రీనివాసరావు... త్వరలోనే బీజేపీలోకి వెళతారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.

 

కానీ ఆయన మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఆయనపై టీడీపీ కూడా దాదాపు ఆశలు వదులుకుందనే వార్తలు వినిపించాయి. సడన్ గా ఆయన ఇక్కడ మెరవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పార్టీ తరఫున చంద్రబాబు ఎన్నిసార్లు సమావేశాలు పెట్టినా రాని ఈ మాజీ మంత్రి బాలయ్య బాబు ఫంక్షన్ కోసం హడావిడిగా రావడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు చాలామంది   గంటా శ్రీనివాస్‌ తో పాటు ఎమ్మెల్యేలు వాసుప‌ల్లి గ‌ణేష్‌, వెల‌గ‌పూటి రామ‌కృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస్ ఈ ఫంక్షన్ కి వచ్చారు .. బాలకృష్ణ చిన్న అల్లుడు ఈ ఫంక్షన్ లో  శ్రీ భారత్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: