కోలీవుడ్ లో సూపర్ హిట్ దర్శకుడుగా ఎంతో ఫేమస్ కేఎస్  రవికుమార్. సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎన్నో హిట్స్ ఇచ్చారు. టాలీవుడ్ లో మెగాస్టార్ తో కూడా స్నేహం కోసం అనే సినిమా తీసి హిట్ ఇచ్చారు. ఇక చాలా కాలం తర్వాత ఈ సీనియర్ దర్శకుడు నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందించీ మొదటి సినిమా  జై సింహ. ఈసినిమాకు ముందు నుంచే కోలీవుడ్ లో ఫాం ని కోల్పోయి ఉన్నారు. అందుకే టాలీవుడ్ లో ఒకసారి లక్ చెక్ చేసుకోవాలని బాలయ్యని తన కథ తో మెప్పించారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బాలయ్య తో తెరకెక్కించిన పైసా వసూల్ భారీ డిజాస్టర్ ను అందుకుంది. కానీ ఈ సినిమాలో బాలయ్య పర్‌ఫార్‌మెన్స్ కి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 

 

అందుకే బాలయ్య నెక్స్ట్ సినిమా మీద కాస్త అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎప్పుడైతే కె.ఎస్.రవికుమార్ తో బాలయ్య సినిమా అనగానే ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా  అంత ఆసక్తిని చూపించలేదు. అయితే రవికుమార్ సినిమాని ఇలా మొదలు పెట్టారో పూరి కంటే ఫాస్ట గా జస్ట్ టూ మంత్స్ లోనే సినిమాను కంప్లీట్ చేసి బాలయ్యకు బాగా కలిసివచ్చే సంక్రాంతి పడుగ సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక గత ఏడాది సంక్రాంతి విడుదలైన ఈసినిమాకు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు. దానికి తోడు రివ్యూస్ కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే  అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. పవర్ స్టార్ నటించిన అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడంతో వేరే ఆప్షన్ లేక జై సింహ పై ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. మొదటి ఆట తో నెగిటివ్ టాక్ వచ్చినప్పటికి రెండవరోజునుంచే ఫుల్ రన్ లో  బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి యావరేజ్ హిట్ గా నిలిచింది. 

 

ఇక బాలయ్య-రవికుమార్ కి బాగా ట్యూన్ అవడంతో మళ్ళీ ఇదే కాంబినేషన్ లో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు తేవడానికి సిద్దమయ్యారు. ఈ కాంబినేషన్ లో రూపొందిన రూలర్ వచ్చే శుక్రవారం  గ్రాండ్ గా రిలీజ్ కి సిద్దమవుతోంది. ప్రస్తుతం బాలయ్యసినిమా మీద చాలా అంచనాలే పెట్టుకున్నారు. అందుకు కారణం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో భారీ డిజాస్టర్స్ ను చూడవలసి వచ్చింది. ఎంతో ఆశపడి చేసిన తండ్రి బయోపిక్ బాలయ్యకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అందుకే మరో సారి ఆయనకు బాగా అలవాటైన జానర్ లో అందులోను కె.ఎస్. రవికుమార్ తో సినిమాని రెడీ చేశారు. అయితే రూలర్.. జై సింహ లా జస్ట్ హిట్ అవుతుందా లేక బోయపాటి తెరకెక్కించిన సింహా లాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అన్న ఆసక్తి ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ లో రాజుకుంది.  
 

అయితే బాలయ్యకి గట్టి పోటీగా డిసెంబర్ 20న రూలర్ తో పాటు తోపాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మారుతి కాంబోలో రెడి అయిన ప్రతి రోజూ పండగే, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. దబంగ్ 3, కోలీవుడ్ హీరో కార్తి నటించిన దొంగ సినిమా కూడా విడుదలకానున్నాయి. వీటిలో దబంగ్ 3, దొంగ వల్ల నష్టమేమి ఉండకపోవచ్చుగాని సాయి ధరం తేజ్ ప్రతి రోజూ పండగే సినీఅతో మాత్రం కలెక్షన్స్ కు కాస్త దెబ్బ పడే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. అయితే బాలయ్య ఈ పోటీని తట్టుకొని యావరేజ్ కంటెంట్ తో  రూలర్ బ్లాక్ బస్టర్ అవుతుందా లేక  బోల్తాపడతుందో చూడాలి. ఇక ప్రస్తుతం రూలర్ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్  వైజాగ్ లో ఈరోజు గ్రాండ్ గా జరిగింది.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: