ఎస్ ఎస్ రాజమౌలి చారిత్రాత్మక యుద్ధ ప్రాతిపదిక పై నిర్మితమైన బాహుబలి చిత్రం తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అతి పెద్ద ఇండియా స్టార్లలో ఒకరిగా అవతరించాడు. అతను చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సాహోలో కనిపించాడు, ఇది బాక్సాఫీస్ వద్ద వాణిజ్య పరంగా అపజయం పాలైంది.
ప్రభాస్, krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించబోయే తన తదుపరి చిత్రం జాన్ చిత్రీకరణను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. భవిష్యత్తులో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయడానికి ప్రభాస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నిర్మితం కాబోయే ప్రాజెక్టు పై ప్రభాస్ ఇప్పటికే సంతకం చేశారు. టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తమతో సినిమా తీయడానికి ఇప్పటికే ప్రభాస్కు 13 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించినట్లు వార్తలు బయటకి వచ్చాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ప్రభాస్కు 5 కోట్ల రూపాయల ముందస్తు చెక్కును ఇచ్చారు. ఇటీవల వారు ఒక ప్రాజెక్ట్ కోసం మిర్చి స్టార్కు 8 కోట్ల భారీ అడ్వాన్స్ కూడా చెల్లించారు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కోసం మొత్తం 13 కోట్లు ప్రభాస్కు చెల్లించారు. ప్రస్తుతం, నిర్మాతలు దర్శకుడి వేటలో ఉన్నారు. ప్రభాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ యొక్క రాబోయే ప్రాజెక్ట్ 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జనవరి రెండవ వారం నుండి ప్రభాస్ జాన్ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ మరియు పూజా హెగ్డే నటించిన ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలో కనిపించనున్నారు జాన్ చిత్ర వర్గాలు వెల్లడించాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన యూరోపియన్ నగరం సెట్ లో షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం, ప్రభాస్ విరామంలో ఉన్నారు. పూజా హెగ్డే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆలా వైకుంటపురం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ కూడా ఒక సినిమా కోసం దిల్ రాజుతో జతకట్టాడు.