ఆర్ ఎక్స్ 100తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కార్తికేయ. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం లో కార్తికేయ యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించినా లుక్స్ తో మాత్రం ఆకట్టున్నాడు. ఇక ఈ చిత్రం విజయం సాధించడం తో కార్తికేయకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే ఇక్కడే ఈహీరో పెద్ద తప్పు చేశాడు. మంచి కథలను ఎంపిక చేసుకోకుండా ఛాన్సులు వచ్చాయి కాదని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందులో భాగంగా హిప్పీ లో నటించగా ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆతరువాత గుణ 369అంటూ వచ్చినా అది కూడా విజయాన్ని అందించలేదు. ఇక 90ఏం ఎల్ తోనైనా హంగామా చేద్దాం అనుకున్నాడు కానీ ఇటీవల విడుదలైన ఈ చిత్రం కూడా డిజాస్టర్ జాబితాలో చేరింది. దాంతో కార్తికేయ కెరీర్ ఇప్పుడు డేంజర్ జోన్ లో పడింది.
అయితే ఇలాంటి టైం లో కూడా మనోడి సుడి తిరిగింది. వరుసగా మూడు పరాజయాల తరువాత నాల్గో సినిమా కోసం గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో పడ్డాడు కార్తికేయ. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కార్తికేయ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. నూతన దర్శకుడు కౌశిక్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి 'చావు కబురు చల్లగా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తోనే ఆసక్తిని రేకిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ , బస్తి బాలరాజ్ గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.బన్ని వాసు నిర్మించనున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ
సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
మరి ఈ చిత్రమైన విజయం సాధించి కార్తికేయ కు లైఫ్ ఇస్తుందో లేదో చూడాలి.