తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్  కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం 'దర్బార్'.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాలను  శరవేగంగా  జరుపుకుంటున్న ఈ చిత్రం  వచ్చే  ఏడాది సంక్రాంతికి  విడుదలకానుంది.  ఈ చిత్రంలో  రజినీ, ఆదిత్య అరుణాచలం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.  ఇక ఈచిత్రం యొక్క  ట్రైలర్  కోసం రజినీ అభిమానులు ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు.  ఇప్పటికే  ట్రైలర్ కట్ కూడా  అయిపోయింది. నిజానికి  ఈ ట్రైలర్ ను  రజినీ  పుట్టినరోజుసందర్భంగా  ఈనెల 12న విడుదలచేయాలని ప్లాన్ చేశారు కానీ  అనివార్యకారణాల వల్ల ఆ రోజు విడుదలచేయలేకపోయారు. ఇక తాజాగా దర్బార్  ట్రైలర్ ను  ఈనెల 16న సాయంత్రం 6:30 గంటలకు  విడుదలచేయనున్నారని  సమాచారం.  
 
 
 
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  లేడీ సూపర్ స్టార్  నయనతార హీరోయిన్ గా నటించగా యంగ్ హీరోయిన్  నివేద థామస్ రజినీకి కూతరుగా కనిపించనుంది.  వీరితోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.  మురగదాస్ - రజినీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో  దర్బార్  పై  తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి  అంచనాలు వున్నాయి.  దర్బార్ ను తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదలచేయనున్నాడు .  అయితే రేపు  దర్బార్ తమిళ వెర్షన్ ట్రైలర్ తోపాటు  తెలుగు వెర్షన్  ట్రైలర్ ను  కూడా  విడుదలచేస్తారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.  ఇక ప్రస్తుతం రజినీకాంత్,మాస్ డైరెక్టర్   శివ డైరెక్షన్ లో  తన 168 వ చిత్రంలో నటించడానికి  రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో  మీనా , కుష్బూ , కీర్తి సురేష్  , ప్రకాష్ రాజ్ ప్రముఖ నటీనటులు నటించనున్నారు.   సన్ పిక్చర్స్ ఈచిత్రాన్ని  నిర్మించనుండగా ఇమ్మాన్ సంగీతం అందించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: