ఆర్ ఎక్స్ 100 ద్వారా తెలుగులో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకున్న హీరో కార్తికేయ ప్రస్తుతం మరో కొత్త చిత్రంతో మన ముందుకు రాబొతున్నాడు. మొన్న వచ్చిన ౯౦ ఎమ్ ఎల్ అంతగా ఆకట్టుకోలేదు. అయినా కూడా మరో సినిమా అతని ఖాతాలోకి చేరింది. అల్లు అరవింద్ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కార్తికేయ చేయడం వెనక ఒక గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది.
గుణ 369’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్తో స్టేజ్ మీద చిన్న తమాషా చేశాడు ఆ చిత్ర కథానాయకుడు కార్తికేయ. ఈ వేడుకలో బోయపాటి శ్రీను కూడా పాల్గొనగా.. మాటల మధ్యలో అరవింద్ ‘సరైనోడు’ తర్వాత గీతా ఆర్ట్స్లో బోయపాటితో మరో సినిమా ఉంటుందని అన్నాడు. మధ్యలో జోక్యం చేసుకుని హీరో నేనేనా అని అడిగాడు కార్తికేయ.
వెంటనే అరవింద్ తడుముకోకుండా ‘వెల్కం టు గీతా ఆర్ట్స్’ అనేశాడు. ఆ సమయానికి ఆ మాటలు ఏదో తమాషాకి అన్నట్లే. ఆ తర్వాత ఆ మాటలని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కార్తికేయతో నిజంగా గీతా ఆర్ట్స్ లో సినిమా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు తమాషాగా అన్న ఆ మాటలే నిజమయ్యాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కార్తికేయ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది.
చావు కబురు చల్లగా అనే టైటిల్ తో కౌశిక్ పెగల్లపాటి అనే నూతన దర్శకుడు చిత్రాన్ని రూపొందించానున్నాడు. అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమాలో బస్తీ బాలరాజు అనే క్యారెక్టర్ చేయనున్నాడు కార్తికేయ. ఈ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుందట. ఇంకా ఈ సినిమాలో కార్తికేయ సరసర ఏ హీరోయిన్ చేస్తుందనేది తెలియలేదు. మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.