సినిమాలు తీసిన తర్వాత ఆ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరని అంటే చెప్తారు కానీ ఆ సినిమాను ఎవరు నిర్మించింది అంటే మాత్రం చెప్పడం కష్టం. సినిమా అనేది ఒక టీమ్ కి సంబంధించినది అయినా కూడా ఆ టీమ్ లో ఉన్నవాళ్ళకి కాకుండా తెర మీద కనిపించే వాళ్లకే పేరొస్తుంది. సినిమాని మోసేది వాళ్ళే కాబట్టి అందులో తప్పేమీ లేదు. అయితే సినిమా నిర్మించిన వారికి కూడా పేరు రావడం చాలా తక్కువ మందికే అవుతుంది.

 


అలా పేరొచ్చిన నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్, దిల్ రాజు బ్యానర్,  గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలు ఉన్నాయి. అయితే ఇవన్నీ చాలా రోజుల నుండి తెలుగులో సినిమాలని నిర్మిస్తూ వస్తున్నాయి. కానీ సినిమా నిర్మాణ రంగంలోకి దిగిన కొద్ది రోజుల్లోనే పేరు రావడం అనేది ఒక్క మైత్రి మూవీ మేకర్స్ కే దక్కిందేమో! అనతి కాలంలోనే ఈ సంస్థ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగి పొయింది. పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తూ మంచి మంచి విజయాలు దక్కించుకుంటుంది.

 

ఈ సంస్థ దగ్గర భారీ ప్లాన్ ఉందట. తెలుగులో ఉన్న అందరి స్టార్ల హీరోల డేట్స్ వీరి దగ్గర ఉన్నాయట. పవన్ కళ్యాణ్ నుండి ఎన్టీఆర్, ప్రభాస్ వరకు అందరినీ లాక్ చేశారట. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమను నిర్మించేది కూడా వీరే.అయితే ప్రభాస్ తో సినిమా చేయడానికి ఈ సంస్థకి ఆసక్తిగా ఉందట.పాన్ ఇండియా బేస్ సినిమాని ప్రభాస్ తో చేయాలని అందుకోసం ప్రభాస్ కి భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చిందని తెలుస్తోంది.

 

మైత్రి నుంచి ఇంతకుముందే ప్రభాస్ ఐదు కోట్ల అడ్వాన్స్ అందుకున్నారట. దానికి అదనంగా ఇటీవల మరో 8కోట్లు మైత్రి సంస్థ ప్రభాస్ కి అదనపు అడ్వాన్స్ రూపంలో ఇచ్చిందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్ ప్రస్తుత కమిట్ మెంట్లు పూర్తి కాగానే మైత్రికి సినిమా చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. డార్లింగ్ ప్రస్తుతం జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ చిత్రంలో నటిస్తున్నాడు. తదుపరి మైత్రి బ్యానర్ లోనే సినిమా చేస్తాడని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: