అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అంతలా ఆమె 'జబర్దస్త్' షో ద్వారా తెలుగువారికి దగ్గరైంది. తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్కు గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతోంది అనసూయ. అంతేకాదు ప్రస్తుతం టీవీ తెరపై అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న భామగా అనసూయ రికార్డులకు ఎక్కింది కూడా. అంతేకాదు బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలలో ఈ భామ కూడా ఒకరు. అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది.
గతేడాది రామ్ చరణ్, సమంతల ‘రంగస్థలం’లో రంగమ్మతగా తనలోని నటిని ఎలివేట్ చేసింది. అంతకు ముందు ‘క్షణం’ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఆమె నటించిన ‘కథనం’ మూవీ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కానీ అనసూయ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వాస్తవానికి అనసూయ కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించింది. మొదటగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లోనూ పని చేసింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. ఎప్పుడైతే 'జబర్ధస్త్' షోలో అడుగు పెట్టిందో.. అప్పుడే అమె లైఫ్ టర్న్ అయిందని చెప్పాలి.
ఇక మరోవైపు సోషల్ మీడియాలో అనసూయ తన హాట్ సొగసులతో కుర్రకారును హీటెక్కించడంలో ఏ మాత్రం తగ్గదు. అయితే ప్రస్తుతం జబర్ధస్త్ షోలో యాంకరింగ్ చేస్తున్న అనసూయకు ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు 'జబర్ధస్త్' కామెడీ షోలో యాంకర్గానే కనిపించిన అనసూయకు తాజాగా మరో ప్రమోషన్ పొందింది. వచ్చే వారం ఎపిసోడ్లో అనసూయ కాస్త రోజా పక్కన కూర్చుని జడ్జ్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. రోజా అడగడం వల్లే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఎలాగైతే నాగబాబు స్థానంలో ఈ ముద్దుగమ్మ కూర్చోబోతుంది. అలాగే, ఈ ఎపిసోడ్కు పోసాని కృష్ణ మురళీ గెస్ట్గా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.