సాధారణంగా స్టార్‌ ఫ్యామిలీస్‌ నుంచి వారసులుగా ఎంట్రీ ఇచ్చే మహిళలకు సక్సెస్‌ చాల తక్కువగా వస్తుంది. అలాగే అభిమానులు కూడా వారసురాళ్లు ఇండస్ట్రీలో అడుగుపెడితే ఒప్పుకోరు. అయినా సినీ ఇండస్ట్రీలో సందడి చేస్తూనే ఉంటారు కొందరు. మెగాస్టార్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైంది సుష్మిత. మెగాస్టార్ పెద్ద కూతురైన సుష్మిత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసింది. దీంతో చిరు ఆమె కూతురునే కాస్ట్యూమ్ డిజైనర్‌ గా ఎంచుకున్నాడు. ఇటీవల చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150 తో పాటు రంగస్థలం, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలకు డిజైనర్‌ గా పనిచేసింది సుష్మిత.  


అయితే సుష్మిత చేసింది తక్కువ సినిమాలే అయినా.. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే డిజైనర్‌ గా సక్సెస్‌ అయిన సుష్మిత తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టే ఆలోచనలో ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. త్వరలో సుష్మిత కూడా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించే ఆలోచనలో ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. 


ఇప్పటికే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్‌, నాగబాబు, రామ్‌ చరణ్‌లకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్‌ లోకి సుష్మిత కూడా అడుగుపెట్టనుందన్న టాక్‌ వినిపిస్తోంది. మొదట తన బ్యానర్‌ లో ఓ వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ కి సంబంధించిన కథలను వింటుందట. తొలి ప్రయత్నంగా ఓ చిన్న వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించి తరువాత నెమ్మదిగా సినిమాలు కూడా నిర్మించాలని ప్లాన్‌ చేస్తుందట. 


అందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ కూడా ప్రారంభించిందన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే సుష్మిత బ్యానర్‌ ఎప్పుడు లాంచ్‌ చేస్తుందన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మెగాస్టార్‌ వారసుడిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన రామ్‌ చరణ్‌ ఘనవిజయం సాధించాడు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ను స్థాపించాడు. ఆ బ్యానర్‌లో తొలి సినిమాగా ఖైదీ నంబర్‌ 150 సినిమాను తెరకెక్కించి సూపర్‌ హిట్ అందుకున్నాడు. తరువాత రెండో సినిమాగా సైరా నరసింహారెడ్డిలాంటి భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించాడు

మరింత సమాచారం తెలుసుకోండి: