నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా "మళ్ళి రావా" ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జెర్సీ". నాని క్రికెటర్ గా కనిపించిన ఈ చిత్రం ప్రేక్షకులని అమితంగా ఆకర్షించింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. తెలుగులో వచ్చిన సెన్సిబుల్ చిత్రాలలో చెప్పుకోదగ్గ చిత్రంగా "జెర్సీ" నిలిచింది. ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా నడిచింది.

 

తెలుగులో సూపర్ హిట్ అయి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కి వెళ్ళింది. షాహిద్ కపూర్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తెలుగు సినిమాని రీమేక్ చేయడం షాహిద్ కపూర్ కెరీర్లో ఇది రెండవసారి. మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి సినిమాని రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్ష కురిపించింది.

 

అయితే ఈ సినిమా కూడా అదే విధంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించనుంది. వచ్చే వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొడలుకానుంది. ఫస్ట్ షెడ్యూల్ ను చండీగఢ్ లో షూట్ చేసుకోబోతుంది. అక్కడ లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. అక్కడ షూట్ చేస్తున్నారు. ఇప్పటికే షాహిద్ క్రికెటర్ పాత్ర కోసం ట్రైనింగ్ కూడా మొదలుపెట్టారు.

 


ఈ సినిమాని ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో భాగస్వామం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఆగష్టు 28వ తేదీన చిత్రం విడుదలకానుంది. . తెలుగులో మాదిరిగానే హిందీలో కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: