మహేశ్ బాబు ఫాన్స్ మాత్రమే కాదు యావత్ ఇండస్ట్రి మొత్తం ఈ మాట ఓపెన్ గా చెబుతోంది .అనిల్ రావిపూడి డైరెక్షన్ లో, మహేశ్ బాబు హీరోగా సరిలేరు నీకేవ్వరూ సినిమా సంక్రాంతి కి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయం లో ప్రేక్షకులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. బ్లాక్ బుస్టర్ గా నిలిచిన మైండ్ బ్లాక్ సాంగ్ పల్లెటూర్లలో కూడా ఆటోలలో మారుమోగుతోంది అంటే ఇక మాస్ లుక్ తో మహేశ్ బాబు కోసం జనం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు ..

 

 

అనిల్ రావిపూడి అనగానే మనకి గుర్తుకు వచ్చేది కామెడీ .. పటాస్ లాంటి సీరియస్ కథలకి కూడా ఫుల్ కామెడీ టచ్ ఇవ్వగలిగిన డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి .. ఆ తరవాత కాలం లో వరస హిట్ సినిమాలతో ఇండస్ట్రి లో మరొక శ్రీను వైట్ల అనిపించుకున్నాడు. శ్రీను వైట్ల కీ అనిల్ కీ తేడా ఏంటి అంటే యాక్షన్ నీ కామెడీ నీ సమపాళ్లలో అందించగలడు . ఆ నమ్మకం తోనే మహేశ్ బాబు సుకుమార్ కథ ని సైతం పక్కకి పెట్టి రావిపూడి కి ఛాన్స్ ఇచ్చాడు .

 

 

 

అనిల్ కూడా సినిమా లో విజయశాంతి లాంటి సీనియర్ హీరోయిన్ ని పెట్టి సినిమా కే వన్నె తెచ్చాడు . సరికొత్త స్క్రిప్ట్ తో , డైలాగ్స్ తో , పాటలతో మహేశ్ ని చాలా కొత్తగా చూపించే ప్రయత్నం లో అనిల్ రావిపూడ్ ఎంతవరకూ సక్సెస్ అవుతాడు అనేది చూడాలి. అయితే ఒక్క విషయం లో అనిల్ జాగ్రత్త లు తీసుకుంటే సరిలేరు నీకేవ్వరూ బ్లాక్ బస్టర్ అవ్వడం ఎవ్వరూ ఆపలేరు అంటున్నారు మహేశ్ ఫాన్స్ . మహేశ్ ఈ మధ్య తీస్తున్న సినిమా లలో క్లైమాక్స్ కాస్తంత వీక్ గా ఉంటోంది. భారత్ అనే నేను , మహర్షి , శ్రీమంతుడు ఇలా అన్నీ హిట్ సినిమాలు కొడుతున్నా కూడా క్లైమాక్స్ విషయం లో మాత్రం బెడిసికొడుతోంది.

 

 

 

సొ అనిల్ ఈ విషయం గ్రహించిన డైరెక్టర్ కాబట్టి ఆఖరి పతాక సన్నివేశాలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే నాన్ బాహుబలి హిట్ కొట్టడం పెద్ద విషయం ఏమీ కాదు అంటున్నారు .. కొన్ని సెంటర్ లలో బాహుబలి ని కూడా దాటిపోవడం ఖాయం అని మహేశ్ ఫాన్స్ నమ్మకంగా ఉన్నారు .. మహేశ్ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకునే ప్రతీ ఒక్కరూ ఈ న్యూస్ కి వాట్సాప్ లోని తోటి మహేశ్ ఫాన్స్ కి షేర్ చేయండి .. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: