కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ మధ్యనే లాంఛనంగా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు కూడా. అయితే ఈ మూవీలో చిరంజీవి పక్కన హీరోయిన్ ఎవరన్న విషయం సస్పెన్స్ గానే ఉండిపోయింది.

 

చిరంజీవి పక్కన హీరోయిన్ అంటే కాస్త ముదురు హీరోయినే కావాలి. అందుకే..అనుష్క, కాజల్‌, నయనతార, త్రిష..అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. అయితే ఇప్పడు ఆ ముద్దుగుమ్మ ఎవరో తేలిపోయిందట. ఎట్టకేలకు మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా త్రిషను కన్ ఫామ్ చేసేశారట.

 

ఈ విషయం నేరుగా త్రిషయే ప్రకటించింది. ఇన్ డైరెక్టుగా చెప్పేసింది. ఎలాగంటే.. ఓ సినీ విశ్లేషకుడు ఈ ఏడాది త్రిష మూడు సినిమాలతో అలరించబోతున్నారని జాబితాను ట్వీట్‌ చేశారు. మణిరత్నంతో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, మోహన్‌లాల్‌తో ఓ సినిమా, చిరంజీవి-కొరటాల శివ సినిమాలో ఆమె నటించబోతున్నారని పేర్కొన్నారు.

 

ఈ ట్వీట్‌ చూసి త్రిష రియాక్టయ్యింది. ఈ వార్త నిజమే అన్నట్టు విక్టరీ ఎమోజీతోపాటు #2020 ట్యాగ్‌ను జత చేసింది. అంటే.. చిరు చిత్రంలో ఆమే హీరోయిన్ అనే తేలిపోయినట్టేగా.. అయితే అధికారికంగా మాత్రం దర్శక, నిర్మాతలు మాత్రం కథానాయిక ఎవరు అనే విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక చిరు-త్రిష ఇది వరకు ‘స్టాలిన్‌’లో నటించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: