టాలీవుడ్ లో వరుసగా హిట్స్ అందుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు కామెడీ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు.  కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీతో పాటు ఈ సంవత్సరం వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి లాంటి మూవీస్ లో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు.  ఈసారి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సరికొత్త పందాలో రాబోతున్నారు.  అనీల్ రావిపూడి దర్శకత్వంలో కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ టచ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.  ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో మహేష్ బాబు సరికొత్తగా కనిపిస్తున్నాడు.  గతంలో దూకుడు సినిమాతో కడుపుబ్బా నవ్వించారు.  

 

ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు మూవీతో మరోసారి అభిమానులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్దమవుతున్నారు.  ఈ మూవీ లో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  చాలా కాలం తర్వాత తెరపై కనిపించబోతున్నారు అలనాటి లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి.  మొదటిసారిగా మహేష్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తుంది.  దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మహేష్ బాబు - విజయశాంతి కలిసి నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ ప్రేక్షకులలో మూవీపై అంచనాలు పెంచింది.

 

దేవి శ్రీ సంగీతం కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ మూవీలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుందని పోస్టర్‌లో తెలిపారు. ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురవడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. ఇక మూవీకి సంబంధించి ప్రతి సోమవారం సాంగ్ విడుదల చేస్తుండగా, ఈ సోమవారం హీ ఈజ్ సో క్యూట్ అనే సాంగ్ విడుదల కానుంది. ఈ సాంగ్‌కి సంబంధించి రష్మిక టిక్ టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: