అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు జనవరి 11న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అలనాటి తార విజయశాంతి చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో రెండు పాటలు రిలీజ్ చేశారు.

 

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో ఈ పాటలు మ్యాజిక్ చేశాయని చెప్పాలి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక ముఖ్యమైన వార్త బయటకు వచ్చింది. జనవరి 5వ తారీఖున సాయంత్రం ఐదు గంటల నుండి హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగనున్నది. దీనిని అధికారికంగా యూనిట్ సభ్యులు తెలిపారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ వచ్చే అవకా

 

 వరుసగా నాలుగు సినిమాలు విజయాలతో ఊపు మీద ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు తనలోని కామెడీ యాంగిల్ ని ఈ సినిమాతో ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే రష్మిక మందన అందం కూడా ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని తెలుస్తుంది.

 

ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తయింది. దాదాపు వంద కోట్ల పైగా బిజినెస్ చేసిన ఈ సినిమా హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ఇండస్ట్రీలో ఎన్నో ఆశలు ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: