అందం అభినయం  కలగలిపిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా... తన అందంతో అందరిని మెస్మరైజ్  చేయగల సత్తా రాసి కన్నా సొంతం... తన చిరునవ్వుతో ప్రేక్షకులందరి మతి పోగొట్టగలడు ఈ అమ్మడు . ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తనదైన సత్తా చాటుకుంటూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ అమ్మడు ఈ మధ్య అందాల ఆరబోత కూడా చేసేస్తున్నది . తన అందాలతో ఎంతో మంది ప్రేక్షకుల చెమటలు పట్టించింది ఈ అమ్మడు. తొలిప్రేమ సినిమా తో తన కెరీర్ ఇంకా ఫాస్ట్ గా దూసుకుపోతుంది. తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా నటించిన రాసి కన్నా... ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. 

 

 

 

ఇప్పుడు మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన ప్రతి రోజు పండుగ సినిమాలో నటిస్తుంది. కాగా  ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజాగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై స్పందించింది  రాసి కన్నా. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దిశ చట్టంపై రాసి కన్నా ప్రశంసల వర్షం కురిపించింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని... ఈ చట్టంలో నిందితులకు చనిపోతామని భయం ఏర్పడుతుందని... దీంతో తప్పు చేయాలంటేనే భయపడతారని  అంటూ రాసి కన్నా తెలిపింది . ఇక ఈ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని..అన్ని  రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ రాసి కన్నా కామెంట్ చేసింది.

 

 

 

 ప్రస్తుతం రాసి కన్నా కామెంట్స్  నెట్ లో వైరల్ అవుతున్నాయి . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగ  ఏపీ అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన  విషయం తెలిసిందే. ఇక అంతే కాకుండా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా చట్టం పై చాలా మంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా వీరి జాబితాలోకి రాసి కన్నా కూడా చేరిపోయింది. అయితే దిశ చట్టం ద్వారా ఆడపిల్లలపై అఘాయిత్యాలు పాల్పడుతున్న వారికి వెంటనే శిక్షపడేలా చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలు రూపొందించింది జగన్ సర్కారు.

మరింత సమాచారం తెలుసుకోండి: