ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సమంతసినిమా షూటింగ్ సమయంలో నాగ చైతన్యతో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమాయణం చాలా రోజుల పాటు నడిచింది. చివరకు ఇద్దరి కుటుంబాలు వీరి పెళ్ళికి ఒకే చెప్పడంతో ఇద్దరూ కలిసి ఏడు అడుగులు వేశారు. పెళ్లి అయిన తరువాత కూడా వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నారు. సమంత తనకు పెళ్లి అయ్యాక చేసిన సినిమాల్లోనూ చాలా వరకు విజయం సాధించాయి.

 

గత సంవత్సరం విడుదలైన సమంత నటించిన యూ టర్న్ సినిమా సమంత నటనకు మంచి ప్రశంసలు తెచ్చిపెట్టింది. వసూళ్ల పరంగా పెద్ద విజయం సాధించకపోయినా సామజిక సమస్యను కళ్లకు కట్టినట్లు చూపించడంలో చిత్రం విజయవంతం అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై సమంతను బాలీవుడ్ నిర్మాతలు యూ టర్న్ రీమేక్ లో నటించాల్సిందిగా కోరారు, కానీ సమంత మాత్రం బాలీవుడ్ లో తాను నటించనని నిర్మొహమాటంగా చెప్పేసింది.

 

దీనితో చేసేదేమీ లేక బాలీవుడ్ నిర్మాతలు వెనుదిరిగారు, అక్కినేని కోడలు తీరు మార్చుకోలేదని, తను మొదట్లో ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు బాలీవుడ్ లో నటించనని ఒక నిబంధన పెట్టుకున్నారని ఆ విషయంలో అస్సలు మారను అంటున్నారని సమంత సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. ఇప్పటికే సౌత్ లో మంచి పేరు తెచ్చుకున్న అనుష్క, నయనతార కూడా బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చినా నో చెప్పేసారు. సమంత కూడా బాలీవుడ్ లో నటించేందుకు ససేమిరా అంటున్నారు. సమంత ప్రస్తుతం ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. శర్వానంద్ తో కలిసి 96 సినిమా రీమేక్ లోనూ నటిస్తున్నారు అక్కినేని కోడలు. బాలీవుడ్ లో సమంత నో చెప్పేసిన ఈ ఆఫర్ కు తాప్సి సైన్ చేసేసిందని సమాచారం. ఏమైనా అక్కినేని కోడలు బాలీవుడ్ లో నటించకుండా తాను మొదట్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం పట్ల నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: