పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ హీరో.. అంతేకాదు తెలుగులో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా పవర్ స్టార్ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకుంటున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని తెలిసిందే. ఈమధ్యనే ఈ సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి.

 

దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా సమంతను తీసుకోవాలని అనుకున్నారు. కాని ఆమె పవన్ సినిమాకు నో చెప్పిందట. ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమా చేసింది సమంత. ఆ సినిమా తర్వాత మళ్లీ సెకండ్ ఛాన్స్ వచ్చింది. కాని అందుకు సమంత మాత్రం నో చెప్పిందట.

 

ప్రస్తుతం సమంత తమిల సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ తో పాటుగా ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తుంది. కమిటైన సినిమాలు పూర్తి చేశాక కెరియర్ లో కొద్దిపాటి గ్యాప్ ఇవ్వాలని చూస్తుంది సమంత. అందుకే పవన్ సినిమా ఛాన్స్ వచ్చినా కాదన్నదని తెలుస్తుంది. సమంత కాదని చెప్పడంతో నివేదా థామస్, అంజలిలు పింక్ రీమేక్ లో నటిస్తున్నారని తెలుస్తుంది.

 

అజ్ఞాతవాసి తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీగా మారాడు. దాదాపు ఇక సినిమాలు చేయడని అందరు ఫిక్స్ అవగా పింక్ రీమేక్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యాడు. బాలీవుడ్ లో ఆల్రెడీ హిట్టైన ఈ సినిమా తెలుగు వర్షన్ అది కూడా పవర్ స్టార్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక రకంగా పవన్ రీ ఎంట్రీ మూవీ కాబట్టి సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: