చందమామ సినిమా తో హీరోయిన్ గా వచ్చిన కాజల్ అగర్వాల్ గురించి చెప్పాలిసిన పనిలేదు. సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా బాగా రాణించింది. కాస్త ఈ మధ్య కొత్త హీరోయిన్స్ రావడం వల్ల జోరు తగ్గిందనే చెప్పాలి.. ప్రస్తుతం కాజల్ చేతిలో ఒక సినిమా ఉంది కమల్ హాసన్ నటిస్తున్న "ఇండియన్ 2" లో హీరోయిన్ గా నటిస్తుంది... ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 


ఇపుడు ఈ చందమామ తాజాగా అల్లు అర్జున్ తో కలిసి ఆడిపాడనుంది.. కాజల్ తన అందాల ఆరబోతని ఎపుడు లిమిట్ లో ఉంచుతుంది. కాని ఈ మధ్య అందాలు ఆరబోసేందుకు సిద్ధం అవుతుంది. జూనియర్ ఎన్టీర్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారుని ఉర్రుతలూగించింది..

 

తాజాగా ఈపుడు అలా వైకుంఠపురం సినిమాలో ఒక భారీ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కాజల్ ని సజెస్ట్ చేయడంతో త్రివిక్రమ్ ఒప్పుకున్నాడట. ఈపుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి కాజల్ తో ఐటమ్ సాంగ్ గూర్చి సంప్రదింపులు చేస్తున్నారట. ఇప్పటికే అలా వైకుంఠపురం సినిమా సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. టీజర్ కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది..

 

అందుకే ఒక భారీ ఐటమ్ సాంగ్ ని చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసారట.. ఫస్ట్ లో త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ కి ఈ ఐటమ్ సాంగ్ హీరోయిన్ విషయంలో విబేధాలు వచ్చినట్లు సమాచారం. త్రివిక్రమ్ అనసూయ, రేష్మి అయితే బాగుంటుందని, అందులోను రెమ్యూన్యిరేషన్ కూడా తక్కువ అయిద్ది అని ఆలోచన చేసాడట.. కాని అల్లు అర్జున్ కి మాత్రం కాజోల్ చేస్తే సినిమాకి మంచి  హైప్ వస్తుందని భావించి కాజల్ ని సజెస్ట్ చేశారట..

 

ఎలాగయితేనే కాజల్ తోనే ఐటమ్ సాంగ్ చేయించేలా ఉన్నారు. ఈ చిత్రం సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది... ఈ రెండు భారీ సినిమాల మధ్య గట్టి పోటీనే ఉండబోతుందని వినికిడి..

 

"అందుకే అలా వైకుంఠ పురం సినిమాలో కాజల్ ని అలా మెరిపించబోతున్నారు"కాజల్ జనతా గ్యారేజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మంచి హిట్ ఇచ్చింది..అలా వైకుంఠ పురం సినిమాలో డాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతున్నట్లు సిని వర్గాల విశ్లేషణ... 

మరింత సమాచారం తెలుసుకోండి: