రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరు స్పీడ్ పెంచారు. ఇటీవల సైరా సినిమాతో హిట్ అందుకున్న మెగాస్టార్. హిట్ డైరెక్టర్ కొరటాల శివతో 152 సినిమాను పట్టాలికించారు. ఇక ఈ సినిమాలో చిరు సరసన ఎవరు నటిస్తారు అనే అంశం పై గత కోదిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి.

 

ఈ నేపథ్యం లో పలువురి పేర్లు వినిపించాయి. అంతకు ముందు అనుష్క.. నయనతార ఇలా పలువురి భామల పేర్లు వినిపించాయి. తాజాగా వాటన్నింటికి తెర దించుతు త్రిష క్లారిటీ ఇచ్చేసింది. తాను మెగాస్టార్ తో జతకడుతున్నానని త్రిష చెప్పేసింది. సోషల్ మీడియా లో ఓ సినీ విశ్లేషకుడు వచ్చే ఏడాది త్రిష మూడు సినిమా లో నటిస్తుందని  వాటిలో మణిరత్నం సినిమా, మెగాస్టార్ మూవీ తో పాటు మరో సినిమాను జత చేసాడు.

 

దానికి రిప్లేగా త్రిష స్పందిస్తూ అవును ఇది నిజమే అని పేర్కొంది. దాంతో మెగాస్టార్ సినిమాలో త్రిష ఫిక్స్ అయి పోయిందని అభిమానులు సంబర పడుతున్నారు. తెలుగు లో ఒకప్పుడు బిజీ హీరోయిన్ అయినా త్రిష ఆ తర్వాత  పూర్తిగా తమిళ సినిమాల తోనే బిజీ అయింది. తాజాగా చిరంజీవి సినిమాల లో నటించిన ఏ హిరోయిన్ అయినా కూడా మంచి సినిమా అవకాశాలు అందుకుంటూ వరుస సినిమాలలో నటిస్తున్నారు..

 

స్టాలిన్ చిత్రం లో జోడిగా నటించిన త్రిష నాయకి సినిమా తర్వాత ఏ సినిమా లో నటించలేదు.. మళ్ళీ ఇప్పుడు చిరు సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది.. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి..ఎంట్రీ ఇస్తోంది. ఫెడ్ అవుట్ అయిన బ్యూటీకి మెగా ఆఫర్ రావడం అంటే మామలు విషయం కాదు. చూడాలి మరి ఈసినిమాతో త్రిష మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందేమో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: