టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన ఆయన కెరీర్ 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ ఖర్చుతో దీనిని నిర్మించడం జరిగింది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించే విజయాన్ని మాత్రమే అందుకుంది. 
 

 

కాగా సినిమాలో మెగాస్టార్ అత్యద్భుత నటనకు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఫిదా అయ్యారు అనే చెప్పాలి. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మిల్కి బ్యూటీ తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఇక అటు బాలీవుడ్ లో హిందీ వర్షన్ లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు అక్కడ కూడా పెద్దగా ఆదరణ లభించలేదు. కాగా తమిళనాడులో మాత్రం ఒకింత పర్వాలేదనిపించేలా కలెక్షన్ రాబట్టింది ఈ సినిమా. ఇకపోతే ఇటీవల ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిన తమిళ టెలివిజన్ ఛానల్, మొన్న ఈ సినిమాను టివిలో ప్రసారం చేయగా, 

 

 

ఊహకందని రేంజ్ లో రేటింగ్స్ వచ్చినట్లు చెప్తున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటివరకు అక్కడ అత్యధి రేటింగ్స్ సంపాదించిన మహేష్ బాబు స్పైడర్, వన్ నేనొక్కడినే తో పాటు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు వచ్చిన రేటింగ్స్ ని కూడా తలదన్నేలా సైరా కు అత్యద్భుతమైన ప్రేక్షకుల రెస్పాన్స్ మరియు రేటింగ్స్ లభించాయట. తమ సినిమా ఊహించిన రేంజ్ లో విజయవంతం కాకపోయినప్పటికీ, తమిళ శాటిలైట్ రేటింగ్స్ లో దూసుకెళ్లడంతో సైరా యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోందట. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: