ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పార్టీలకు అధ్యక్షులుగా ఉన్న నేతలు ఒక పక్క వ్యాపారాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలు చేస్తున్న తరుణంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాలు చేస్తూ కూడా రాజకీయాలు చేయాలని ఎన్నికలు అయిపోయాక సినిమాలకు దూరం అని పవన్ కళ్యాణ్ అన్న సందర్భంలో కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయ్.

 

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సైలెంట్ గా పింక్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు రావటం మరియు అదే విధంగా సినిమాకి సంబంధించి నిర్మాత దిల్ రాజు మ్యూజిక్ సెట్టింగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ద్వారా చేయించడం జరిగిందని ఇటీవలే వార్తలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. అటువంటిదే ఈ సినిమా హీరో ఎవరు అన్నది సస్పెన్స్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాల్లో నెలకొంది.

 

ఒక పక్క పవన్ కళ్యాణ్  పింక్ రీ మేక్ సినిమా చేస్తున్నారన్న వార్తలతో పాటు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ కి 50 కోట్లు నిర్మాత దిల్ రాజు ఇస్తున్నట్లు గాసిప్ వస్తున్నాయి అదేవిధంగా సినిమాకి సంబంధించి బడ్జెట్ కంటే హీరో పవన్ కి ఎక్కువ డబ్బులు దిల్ రాజు ఖర్చు పెడుతున్నట్లు… దీంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ ని క్యాష్ చేసుకుని దిల్ రాజు ఈ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు అభిమానులు పవన్ కళ్యాణ్ క్రేజ్ ని ఈ విధంగా క్యాష్ చేసుకోవడం ఏంటి అంటూ  ఇలా అయితే చాలా కష్టం దిల్ రాజు గారు అని పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించి రెమ్యునిరేషన్ వార్త అధికారికంగా ఇండస్ట్రీలో ఎక్కడ బయటకు రాలేదు గానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్  పింక్ సినిమాకి సంబంధించి పవన్ రెమ్యునరేషన్ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: