టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలాగైనా వచ్చే సంక్రాంతి కచ్చితంగా హ్యాట్రిక్ విజయం సాధించాలని మంచి స్ట్రాటజిక్ ప్రమోషన్ గేమ్ చాలా డిఫరెంట్ గా స్టార్ట్ చేశాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి సంబంధించి పబ్లిసిటీ విషయంలో తెలుగు సినిమా హీరోల అందరి కంటే మహేష్ బాబు ఈసారి చాలా డిఫరెంట్ గా ఇండస్ట్రీ హీరోలందరికీ బుద్ధి వచ్చేలా కేవలం ప్రమోషన్ అంటే సినిమాకి వారం రోజులు ముందు అన్నట్టుగా కాకుండా ఏకంగా నెల రోజుల ముందే సినిమాకి సంబంధించి ప్రమోషన్ విషయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి సంబంధించి ఫోటో గాని మరియు అదే విధంగా సాంగ్ గాని ప్రతి సోమవారం సినిమా యూనిట్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు.

 

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు విడుదలైన సాంగ్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం అద్భుతంగా సంగీత ప్రేక్షకులతో పాటు అభిమానులను అలరిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇటువంటి తరుణంలో ప్రీ రిలీజ్ వేడుక చాలా గ్రాండ్ గా చేయాలని సరిలేరు నీకెవ్వరు సినిమా యూనిట్ డిసైడ్ ఐపోయింది. నీతో ఈ వేడుకను వచ్చే సంవత్సరం జనవరి 5వ తారీఖున ఎల్బీ స్టేడియం లో భారీ ఎత్తున చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇందుకోసం నిర్మాతలు ఏర్పాట్లు చేయటానికి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

 

ముఖ్యంగా ఈ సినిమాలో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి దాదాపు 13 సంవత్సరాల తర్వాత రీ-ఎంట్రీ ఇవ్వటంతో సినిమాపై మంచి అంచనాలు ఇండస్ట్రీలో మరియు అభిమానుల్లో నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనర్ కమర్షియల్ సినిమాగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించినట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: