గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన మెగా బ్రదర్ నాగబాబు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమై పోయాడు. ఆ తర్వాత తన సినిమాలు, టీవీ షోలతో బిజీ అయిపోయాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’. అయితే జబర్దస్త్ టీమ్‌తో సుదీర్ఘ కాలం అనుబంధం ఉన్న నాగబాబు తెగదెంపులు చేసేసుకున్నారు. `జబర్దస్త్` కామెడీ షో నుంచి బయటికి వచ్చేసిన మెగా బ్రదర్ నాగబాబు జీ టీవీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’కు పోటీగా ‘లోకల్ గ్యాంగ్స్’ అనే కామెడీ షోను మొదలుపెట్టారు. 

 

`జబర్దస్త్`కు రెండు కళ్లులా ఉన్న నాగబాబు, రోజాల్లో ఏ ఒక్కరు ఆ సీటులో లేకపోయినా పెద్ద లోటే. కానీ, ఏం చేస్తాం.. నాగబాబు బయటికి వ‌చ్చేసారు. దీంతో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో మార్పులు చేర్పులు జోరుగా జరుగుతున్నాయి. నాగబాబు బయటికి వెళ్లిపోయిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ.. రేటింగ్స్ త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం జీ తెలుగులో నాగ‌బాబు రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది. జబర్దస్త్ నుంచి వచ్చిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్‌పై వరస విమర్శలు చేసిన నాగబాబు.. జీ తెలుగులో వరస ప్రోమోస్‌లో కనిపిస్తున్నాడు. 

 

అయితే ఈటీవీలో వచ్చేదాని కంటే కూడా మూడు రెట్లు ఇక్కడ ఇస్తున్నారని.. అందుకే నాగబాబు ఛానెల్ మార్చేసాడని ప్రచారం జరుగుతుంది. ప్రతీ నెల 30 లక్షలతో పాటు సెట్‌లో అలాగే బయట కూడా వీఐపీ సౌకర్యాలు అందుకుంటున్నాడని తెలుస్తుంది. దాంతోపాటు కార్ వాన్ సౌకర్యం కూడా ఉంది. మొత్తం జీ తెలుగు నెట్ వర్క్‌లో వచ్చే ప్రతీ దాంట్లో కూడా నాగబాబు కనిపించబోతున్నాడు. ఏదైమైనా జాబ‌ర్ద‌స్త్‌తో పోలిస్తే.. జీలో 20 ల‌క్ష‌లు అదనంగానే వస్తుందని ప్రచారం జోరుగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: