‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. అపజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. కమర్షియల్ హంగులతో కూడిన మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ను చిరంజీవినే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు మణి శర్మ, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్ ల కోసం రెండు వారల క్రితం బ్యాంకాక్ కు వెళ్లి వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ ఇదేనంటూ లేటెస్ట్ గా మెగాస్టార్ దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొరటాల శివ సినిమా అంటేనే అందులో కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అలాంటిదే అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాను దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక జనవరిలో సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో లేడీ అమితాబ్ విజయ్ శాంతి ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమచారం. ఇక కథానాయికగా త్రిషను ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టు సమాచారం. మరియు ఈ సినిమాకు ‘గోవింద హరి గోవింద’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు కూడా తెలిస్తోంది.