మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. తన స్టైల్ డ్యాన్స్ లతో ఫ్యాన్స్ ను అలరిస్తున్న ఈ మెగా హీరో సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో వస్తున్నాడు. మూవీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా త్రివిక్రమ్, బన్ని కలిసి మరో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నారు. 

 

సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అన్న కన్ ఫ్యూజన్ ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని అంటున్నారు. రీసెంట్ గా వెంకీమామ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు బాబీ. ఎన్టీఆర్ తో జైలవకుశ తో కూడా తన సత్తా చాటిన బాబీ వెంకటేష్, నాగ చైతన్య మల్టీస్టారర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.

 

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే గ్యాప్ తీసుకున్నా త్రివిక్రమ్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో సినిమా ఫిక్స్  చేసుకున్నాడు. అల వైకుంఠపురములో సినిమాకు ఇప్పటికే సూపర్ బజ్ ఏర్పడింది. అందుకు తగినట్టుగానే ప్రమోషన్స్ ఉన్నాయి.

 

ఎన్టీఆర్ తో జై లవ కుశ తీసిన బాబీ బన్ని తో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. అసలైతే బన్ని కొన్నాళ్లుగా తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ ప్రయత్నాలు చేస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు. అల్లు అర్జున్ కెఎస్ బాబీ కాంబో ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి. ఈ మూవీ గీతా ఆర్ట్స్ తో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుందట. బాబీ బన్ని ఒక ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో ఇన్నర్ టాక్. అల వైకుంఠపురములో హిట్ అయితే ఈ ప్రాజెక్ట్ పై మరింత అంచనాలు ఏర్పడుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: