రోజా వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోజా ఎమ్మెల్యే పదవితో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. రోజా ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జబర్దస్త్ ను వీడుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత ఆ వార్తలు నిజం కాదని తేలింది. గతంలో రోజా తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ కారణమని కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 
 
కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ షో జడ్జీలలో ఒకరైన నాగబాబు షో నుండి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చాక జబర్దస్త్ షోపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ షో నుండి నాగబాబు వెళ్లిపోయినా జబర్దస్త్ షోకు మంచి రేటింగ్సే వస్తున్నాయి. ఈటీవీ ఛానెల్ లో పండుగలకు మల్లెమాల సంస్థ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లు చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 31వ తేదీన ప్రసారం చేయడానికి ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే అనే పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమం డిజైన్ చేశారు. 
 
ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. వర్షిణి, రోజా, హైపర్ ఆది, జానీ మాస్టర్, సుధీర్, విష్ణు ప్రియ, జాఫర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోమోలో వర్షిణి, హైపర్ ఆదిల మధ్య పేలిన పంచులు హైలెట్ అయ్యాయి. జానీ మాస్టర్ వేసిన స్టెప్పులు కూడా ప్రోమోలో హైలెట్ అయ్యాయి. ప్రోగ్రామ్ చివరలో జాఫర్ రోజాను టీవీ షో లకు ఎక్కువ సమయం, ప్రజలకు తక్కువ సమయం కేటాయిస్తున్నారని బయట అనుకుంటున్నారని దీనిపై మీ సమాధానం ఏమిటని ప్రశ్నించాడు. 
 
ఈ ప్రశ్న అడిగిన వెంటనే రోజా సీరియస్ అయినట్టు ప్రోమోలో చూపించారు. రోజా ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పిందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 31వ తేదీ వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రోమోతో ఈ ప్రశ్నకు రోజా ఎలాంటి సమాధానం ఇస్తుందని నెటిజన్లలో ఆసక్తి పెంచటంలో షో నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: