నిన్న సాయంత్రం జరిగిన ‘ప్రతిరోజు పండగే’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ తో తీయబోతున్న ‘పింక్’ రీమేక్ విషయం అధికారికంగా ప్రకటించడంతో పవన్ రీ ఎంట్రీ పై ఇప్పటి వరకు వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. పవన్ కళ్యాణ్ తో సినిమాతీయాలి అని 20 సంవత్సరాలుగా కలలు కంటున్న దిల్ రాజ్ కోరిక వచ్చే ఏడాది నెరవేరబోతోంది. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వడమే కాకుండా ఈ సినిమాకు సంబంధించి తమన్ అప్పుడే రెండు ట్యూన్స్ కూడ ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ‘పింక్’ ఒరిజనల్ కథకు కొద్దిగా మార్పులు చేసి ముగ్గురు హీరోయిన్స్ ను పెడుతున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో నివేదా థామస్ అంజలి అనన్య హీరోయిన్స్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి దిల్ రాజ్ పవన్ కు ఇవ్వబోతున్న పారితోషిక వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఈ మూవీలో నటించడానికి పవన్ కు 50 కోట్ల భారీ పారితోషికం ఇవ్వబోతున్నట్లు టాక్. 

వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం అవుతున్న పరిస్థితులలో ఈ పారితోషికాన్ని దిల్ రాజ్ పవన్ కు సింగిల్ పేమెంట్ లో ఈ సినిమా ప్రారంభంలో ఇస్తానని వాగ్దానం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంత భారీ పారితోషికం ఇచ్చి పవన్ తో ఇలా ‘పింక్’ రీమేక్ చేయడం వెనుక దిల్ రాజ్ స్ట్రాటజీ ఏమిటి అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదని సమాచారం. సింగిల్ సెట్ లో కేవలం రెండు నెలల వ్యవధిలో ఈ సినిమాను పూర్తి చేయాలి అన్నది దిల్ రాజ్ వ్యూహం అని అంటున్నారు. పవన్ కు ఇస్తున్న పారితోషికాన్ని కలుపుకుంటే సుమారు ఈ మూవీ బడ్జెట్ 70 కోట్లు దాటుతున్న పరిస్థితులలో దిల్ రాజ్ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. వాస్తవానికి ఈ సినిమా విజయవంతం అవ్వాలి అంటే 100 కోట్లకు పైగా కలక్షన్స్ వచ్చి తీరాలి. అయితే మాస్ కు పెద్దగా కనెక్ట్ కాని ఇలాంటి సబ్జక్ట్ తో కేవలం పవన్ ఇమేజ్ 100 కోట్లు కురిపిస్తుంద అన్న విషయమై అనేక సమాధానం లేని ప్రశ్నలు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: