ప్రస్తుత ఇండస్ట్రీలో యాంకర్స్ అంతా చాలా హద్దులు మీరుతున్నారు.. అసలు వీరు చేసే పనులు క్రేజ్ వస్తుందని చేస్తున్నారో.. లేదా పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారో, లేదంటే సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో తెలియదు కానీ.. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా లైవ్‌ లోనే యాంకర్ వర్షిణి ఓ సంచలన పని చేసింది. ఆమె చేసిన చిలిపి పని ఆమెకు ఇప్పుడు విమర్శలు తీసుకొస్తుంది. 


తెలుగులో శ్రీముఖి, సుమ, అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి యాంకర్స్ మధ్య పేరు తెచ్చుకోవాలంటే అంత సులభం కాదు. చాలా కష్టమే.. అందుకే వర్షిణి సౌందరరాజన్ పటాస్ షోలో ఇప్పుడు ఏకంగా అరాచకం చేసింది. తెలుగులో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోడానికి ప్రయత్నిస్తున్న ఈ యాంకర్.. షో జరుగుతున్న సమయంలోనే మరో హోస్ట్ హైపర్ ఆదిని ఎత్తుకుంది. న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఈటీవీ ప్రత్యేకంగా ఓ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే అంటూ సాగే ఈ ప్రోమోలో ఆదిని ఈజీగా అలా ఎత్తేసి పట్టుకుంది వర్షిణి. వెంటనే ఎలా ఉంది నీకు అంటూ ఆదిని అడగ్గానే ఇంకాసేపు అలాగే ఎత్తుకుంటే బాగుండేది అంటూ మరో బూతు పంచ్ వేసాడు హైపర్ ఆది. 

 

ఇదంతా అక్కడున్న రోజా సమక్షంలోనే జరిగింది. వర్షిణి ఇలా రెచ్చిపోవడం ఇదే తొలిసారి ఏం కాదు. మొన్న ఈ మధ్యలో పటాస్ షో మధ్యలో ఓ అభిమానిని స్టేజీ పైకి పిలిచి బుగ్గ కొరికింది. ఈ వీడియో వైరల్ కూడా అయింది. సాధారణంగా ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం చెప్పడానికి నిలుచున్న అబ్బాయిని చూసి అబ్బా ఎంత క్యూట్‌గా ఉన్నాడో అంటూ స్టేజ్‌పైకి పిలిచి తర్వాత ఏకంగా అక్కడ అంతా చూస్తుండగానే ఆ అబ్బాయి బుగ్గను గట్టిగా కొరికేసింది. దాంతో అక్కడున్న వాళ్లే కాదు.. చూస్తున్న ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు. ఎంత ముద్దొస్తే మాత్రం ఏంటీ పిచ్చి పని అంటూ నోరెళ్లబెట్టారు చుట్టుపక్కల వారు.

 

పటాస్ షో నుంచి శ్రీముఖి వెళ్లిపోయిన తర్వాత వర్షిణి వచ్చింది. ఇప్పుడు రవి కూడా వెళ్లిపోయాడు. ఆయన స్థానంలోకి చలాకీ చంటి వచ్చాడు. మొత్తానికి క్రేజ్ కోసం హద్దులు దాటేస్తున్న వర్షిణిపై ఫైర్ అవుతున్నారు అభిమానులు. క్రేజ్ కోసం మరి ఇలాంటి పనులు చేస్తారా అంటూ.. ప్రశ్నిస్తున్నారు. గతంలో రష్మీ, సుధీర్ పెళ్లి అంటూ.. వచ్చిన షోకి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మరి టీ.ఆర్.పి కోసం ఇలాంటి పనులు చేస్తారా.. అంటూ చివాట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: