2019 ఎన్నికల తర్వాత పవన్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం.. జనసేన పార్టీలు ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందడం.. జనసేన పార్టీ విషయంలో ఎవ్వరూ ఊహించనిది . అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తారనే ప్రచారం ఊపందుకుంది...ఇకపోతే తన జీవితం మొత్తం ప్రజలకే అంకితం అని మళ్లీ సినిమాల్లోకి రాను అని పవన్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తారు అన్న ప్రచారం మాత్రం ఆగలేదు. ఇకపోతే గత కొన్ని రోజుల నుండి ప్రచారం మరింత ఊపందుకుంది.పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఫిక్స్ అయిపోయింది అని వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగులో రీమేక్ చేస్తున్నారని అందులో అమితాబచ్చన్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు వార్తలు వస్తున్నాయి. దీని గురించి బాలీవుడ్ మూవీ క్రిటిక్ కూడా క్లారిటీ ఇవ్వడం కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. అటు నిర్మాత దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ఇండైరెక్ట్ గా చెబుతూనే ఉన్నారు. కాని తాను సినిమాల్లోకి రాబోతున్నట్లు పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా చెప్పలేదు.ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ కు ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పటికీ సినిమా నిర్మాణాలపై దృష్టి పెడుతున్న అన్నారు తప్ప... సినిమాలో నటించడం గురించి ఇంకా ఏం ఆలోచించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో అభిమానుల్లో మరోసారి సందేహం నెలకొంది. ఈసారి దిల్ రాజ్ పక్క క్లారిటీ ఇచ్చారు పవన్ తొందరగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పేశారు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతి రోజు పండగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే దీనికి హాజరైన నిర్మాత దిల్ రాజు... మాట్లాడుతున్న సమయంలో ప్రేక్షకులంతా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని కేకలు వేశారు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అమ్మ ఆ రోజు దగ్గరలోనే ఉంది కాస్త వెయిట్ చేయండి అంటూ దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తే అటు అభిమానుల కోరిక తీరడంతో పాటు తాను 20 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని డ్రీమ్ కూడా తీరిపోతుంది అని దిల్ రాజు క్లారిటీ ఇవ్వడంతో.. అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.