యజ్ఞం సినిమాతో హీరోగా నిరూపించుకున్న గోపీ చంద్..ఆ తర్వాత వరుసగా హిట్లు అందుకున్నాడు. లక్ష్యం, శౌర్యం, వంటి సినిమాలు ఆయన ఖాతాలో విజయాలుగా చేరాయి. అయితే గత కొన్ని రోజులుగా గోపీ చంద్ కి సరైన హిట్ లేదు. ఆయన నటించిన "లౌక్యం" తర్వాత ఇంత వరకు చేసిన సినిమాలేవీ ఆడలేదు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా కూడా విజయాలు మాత్రం రావట్లేదు. మొన్నటికి మొన్న ఎన్నో ఆశలతో చేసిన "చాణక్య" కూడా నిరాశనే మిగిల్చింది.

 


సైరా లాంటి పెద్ద సినిమాకి పోటీగా రిలీజైన ఈ చిత్రం మినిమమ్ వసూళ్ళు కూడా సాధించలేక పోయింది. దీంతో ఒక్కసారిగా ఆత్మ పరిశీలనలో పడ్డాడు గోపీ చంద్. గోపీ చంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  తమన్నా హీరోయిన్ గా స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమాగా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది.

 

 


విజువల్స్ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం చిత్ర బృందం చాలా కష్టపడుతోందట. అయితే ఈ సినిమా బడ్జెట్ ని ఒక పరిధి దాటి వెళ్ళకూడదని నిర్ణయించారట. ఈ సినిమా అనంతరం గోపీ చంద్ దర్శకుడు తేజ దర్శకత్వలో సినిమా చేయనున్నాడట. కాన్సెప్ట్ బేస్డ్ గా తెరకెక్కే ఈ సినిమా గోపీ చంద్ కి సరిగ్గా సరిపోతుందట. తేజ కూడా గోపీ చంద్ తో చేయడానికి సుముఖంగా ఉన్నాడట. గతంలో తేజ దర్శకత్వంలో జయం, నిజం సినిమాలో గోపీ చంద్ విలన్ గా కనిపించాడు.

 


ఈ చిత్రాలు గోపీ చంద్ కి ఎంతగా పేరు తీసుకువచ్చాయో తెలిసిందే. సంపత్ నందితో సినిమా అనంతరం వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: