తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన సురేష్ ప్రొడక్షన్స్ ఇక నుండి వరుసగా సినిమాలు తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ మధ్య సురేష్ ప్రొడక్షన్స్ దైరెక్ట్ గా చేసిన సినిమాల కంటే ఆ సంస్థ ద్వారా రిలీజైన సినిమాలే ఎక్కువ. సినిమాలై ఫుల్ ప్లెడ్జ్ గా కంటే మరొకరితో కలిసి నిర్మించడానికే ఆసక్తి చూపుతున్నారు. మొన్న వచ్చిన ఓ బేబి సినిమాలో సురేష్ ప్రొడక్షన్స్ వాటా ఉన్నప్పటికీ అది చాలా తక్కువ అని సమాచారం.

 

అలాగే నిన్న వచ్చిన వెంకీ మామా సినిమాని కూడా మరో నిర్మాతతో కలిసి నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. థియేటర్ల వద్ద మరే సినిమా లేకపోవడం, సినిమాలో వెంకీ కామెడీ పార్ట్ అదిరిపోవడంతో వసూళ్ళు బాగా వస్తున్నాయట. రివ్యూవర్లు సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చినప్పటికీ సినిమా దూసుకుపోతుంది. అయితే ఆ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం సురేష్ బాబు వరుస రీమేక్ చిత్రాలని నిర్మిమ్చే పనుల్లో ఉన్నాడట.

 

ఇప్పటికే వెంకటేష్ తో కలిసి "అసురన్" చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇదే కోవలో మరి కొన్ని చిత్రాలను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారట. కేవలం నేరుగా తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో సూపర్ హిట్లుగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రాలను తెలుగులోకి రీమేక్ చేయాలని చూస్తున్నారు.  మొత్తం ఆరు రీమేక్ చిత్రాలు చేయనున్నారని సమాచారం.

 

వాటిలో హిందీ చిత్రాలు ‘డ్రీమ్ గర్ల్, సోనూ కే టిక్కూ కే స్వీటీ’లు ఉన్నాయి. అలాగే ఇంకో రెండు కొరియన్ చిత్రాలు కూడా ఉన్నాయట. అయితే ఆ చిత్రాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తం ఈ ఐదు సినిమాల్లో కనీసం మూడు చిత్రాలైనా వచ్చే యేడాదికి పట్టాలెక్కే ఛాన్సుంది. ఇక వీటితో పాటు రానాతో రూ.180 కోట్ల ‘హిరణ్యకశ్యప’ చిత్రంతో పాటు ఇంకొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా ఉండే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: