మహేశ్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు రానున్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్షకులకు రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందాన కధానాయికగా నటిస్తుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఇప్పటికే ఉపందుకున్నాయి. డిసెంబర్లో ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి 'మైండ్ బ్లాక్' సాంగ్, సూర్యుడివో చంద్రుడివో సాంగ్స్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమాకు సంబంధించి మూడో పాటను ఈరోజు సాయింత్రం రిలీజ్ చెయ్యనున్నారు.
అయితే ఇప్పటికే ఈ సరిలేరు నీకెవ్వరూ నుండి రెండు సాంగ్స్ వచ్చాయి.. రెండు ప్రజలను అంత ఆకట్టుకోలేకపోయాయి. మొదట మాస్ సాంగ్ 'మైండ్ బ్లాక్' అంటూ సాంగ్ ను రిలీజ్ చేశారు. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం మూడో సాంగ్ వస్తుంది. మరి ఈ సాంగ్ అయినా ప్రేక్షకులు ఎక్కుతుందో లేదో చూడాలి.
ఏది ఏమైనా సరిలేరు నీకెవ్వరూ నుండి వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించలేకపోయ్యాయి. మరో వైపు.. బన్నీ బాబు కూడా సంక్రాంతికి వస్తున్నాడు. అల వైకుంఠపురంలో అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రతి పాట ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. మరో వైపు మహేష్ పాటలు ప్రేక్షకులు ఎక్కటం లేదు.. మరి చివరికి ఎవరి సినిమా హిట్ అవుతుందో చూడాలి.