మెగా కాంపౌండ్ హీరోలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ ఏడాది వరుసగా రెండు విజయాలు సాధించారు. ఎఫ్ 2 హిట్‌.. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ ఇలాంటి రెండు సినిమాలతో అదరగొట్టే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకపక్క క్లాస్ సినిమాలు చేస్తూ మరో పక్క మాస్ ప్రేక్షకులను కూడా తన నటనతో రోజురోజుకీ పరిణితి చెందుతూ మెగా కాంపౌండ్ పరువు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 2019లో నిలబెట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముఖ్యం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో “గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్” లాంటి సూపర్ డూపర్ ఉరా మాస్ హిట్ కొట్టడం జరిగింది. ఈ సంవత్సరం మెగా అభిమానులు ఎక్కువగా మెగా కాంపౌండ్ కి సంబంధించిన మెయిన్ హీరోల విషయంలో ఒక చిరంజీవి ‘సైరా’ సినిమా విషయంలో తప్ప బన్నీ మరియు రామ్ చరణ్ లా సినిమాల విషయంలో ఏ మాత్రం పెద్దగా సంతృప్తి పడలేదు.

 

రామ్ చరణ్ ఏడాది స్టార్టింగ్లో వినయ విధేయ రామ తో దారుణమైన ఫ్లాప్ చూడటం జరిగింది. బోయపాటి లాంటి ఇండస్ట్రీ మాస్ డైరెక్టర్ తో రామ్ చరణ్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అభిమానులు అంచనాలు పెట్టుకొని సినిమా హాల్ కి వెళ్తే సినిమాలో ఏమీ లేకపోవడంతో 'వినయ విధేయ రామ' దారుణమైన డిజాస్టర్ గా రామ్ చరణ్ కెరియర్ లో నిలిచిపోయింది.

 

అయితే మరోపక్క బన్నీ మాత్రం ఈ ఏడాది పెద్దగా సినిమాలేవీ చేయలేదు. 'నా పేరు సూర్య' లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత బన్నీ … నెక్స్ట్ సినిమా 'అలా వైకుంఠపురం లో' ఓకే చెయ్యటానికి దాదాపు చాలా టైం తీసుకోవడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే రాజకీయాల్లో ఫుల్ బిజీ. సో మొత్తం మీద 2019 సంవత్సరం మెగా ప్రేక్షకులను అలరించి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రెండు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి మెగా ఫ్యాన్స్ పరువు నిలబెట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: