సిని పరిశ్రమలో డబ్బు ఎలా వస్తుందో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. వాళ్ళ కష్టాలు వాళ్లకు మాత్రమే తెలుస్తాయి. తెర మీద అందంగా కనపడటానికి వాళ్ళు పడే బాధలు వాళ్ళకే తెలుసు. ప్రేక్షకులను సంతోష పెట్టడానికి, వినోదం చూపించడానికి ఎక్కువగా మేకప్ లోనే నటిస్తూ ఉంటారు. మేక్ అప్ లేకుండా ఒక్క సినిమా కూడా కనపడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అదే వాళ్లకు ప్రాణం మీదకు తెస్తుంది అంటున్నారు కొందరు వైద్యులు... అసలు దానికి కారణం ఏంటి అనేది ఒకసారి చూద్దాం...

 

మేకప్ వలన అనారోగ్య కారణాలు సిని జనాన్ని వెంటాడుతున్నాయి. గంటలు గంటలు మేకప్ తో ఉండటం, వారు అలాగే భోజనం చేయడం, చిరు తిండి తినడంతో... కిడ్ని సంబంధిత వ్యాధులు వారిని వెంటాడుతున్నాయి. సిని పరిశ్రమలో చాలా మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. చిన్న చిన్న నటులు కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ రోజులు మేకప్ ని ధరించడంతో చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తున్నాయి. అంతెందుకు టాలీవుడ్ ఓ ఓ బ‌డా ఫ్యామిలీ కుటుంబానికి చెందిన‌ హీరోయిన్ కు సైతం ఇలాంటి మేక‌ప్ వ‌ల వల్లే చ‌ర్మ సంబంధిత వ్యాధి వ‌చ్చిన‌ట్టు టాక్‌..?

 

వారు ఎన్ని విధాలుగా జాగ్రత్తలు పడినా సరే కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన చిన్న వయసులోనే పడుతున్నారు. ఈ మధ్య వాటిల్లో కూడా కలుషితం, రసాయన వాడకాలు అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి. వేణుమాధవ్ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కిడ్ని సంబంధిత వ్యాధితోనే... మరికొందరు నటులు కూడా ఈ జాబితాలో ఉన్నారనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళ బాధ ఎవరికి కనపడదని... డబ్బుల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కొందరు డాక్టర్లే అంటున్నారు. ఏది ఎలా ఉన్నా వారి పరిస్థితి మాత్రం నిజంగా దారుణం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: