మరొక 15 రోజుల్లో 2019 వ సంవత్సరం ముగిసిపోయి 2020 నూతన సంవత్సరం ప్రవేశించబోతోంది. ఇక ఈ గడిచిన దశాబ్దం మొత్తంలో అనేక టాలీవుడ్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే వాటిలో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ ని అందుకున్న సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా అప్పట్లో రూ.125 కోట్ల గ్రాస్ ని అందుకుని సూపర్ స్టార్ కెరీర్ లో మరొక సూపర్ హిట్ గా నిలబడింది. 

 

ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ అయిన ఖైదీ నెంబర్ 150 రూ.135 కోట్ల గ్రాస్ కలెక్షన్ తో ఆయనకు మంచి హిట్ ని అందించింది. అనంతరం ప్రభాస్ నటించిన బహుబలి మొదటి భాగం రూ.635 కోట్లు మరియు బాహుబలి రెండవ భాగం రూ.1900 కోట్లు కలెక్షన్ ని కొల్లగొట్టింది. అలానే ఆ తరువాత ప్రభాస్ మరియు సుజీత్ ల కాంబోలో వచ్చిన సాహో సినిమా ఓవర్ ఆల్ గా రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని అందుకుంది. ఇక వాటితో పాటు ఇటీవల గాంధీ జయంతి కానుకగా రిలీజ్ అయిన మెగాస్ట్రార్ సైరా నరసింహారెడ్డి సినిమా రూ.200 కోట్లు, 

 

మరియు ఈ ఏడాది మే లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి రూ.165 కోట్లు, అలానే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన మల్టి స్టారర్ మూవీ ఎఫ్ 2 సినిమా రూ.122 కోట్లు కలెక్షన్ ని అందుకోవడం జరిగింది. అలానే వీటితో పాటు గత ఏడాది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సుకుమార్ ల కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా రూ.165 కోట్ల గ్రాస్ ని అందుకోవడం జరిగింది. ఈ విధముగా ఈ దశాబ్దంలో ప్రభాస్, మహేష్, చరణ్, వెంకీలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్ ని అందుకున్న హీరోలుగా గొప్ప పేరు దక్కించుకున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: