రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యం లో కడప రెడ్ల’ సినిమా టైటిల్ విషయంలో ఎన్ని వివాదాలు నెలకొన్నయ్యో ఆ వివాదాల కంటే చాలా దారుణంగా ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ తీవ్రమైన స్థాయిలో తనకి పోలిన పాత్ర లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉందని తీవ్ర స్థాయిలో సినిమా విడుదల కాకముందు నుండి విమర్శలు చేసి సినిమాని ఆపేయాలని సెన్సార్ బోర్డుకి లేఖ రాయడం జరిగింది. ఇదే తరుణంలో సెన్సార్ బోర్డు కొన్ని రోజులు సినిమా ఆపేయడం తో పాటుగా 16 కట్లు చెప్పడం మరియు అదే విధంగా సినిమా డిసెంబర్ 12వ తారీకున విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రామ్ గోపాల్ వర్మ తన సినిమాని ఆపాలని చూసిన కే ఏ పాల్ ఫోటో ని మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో తాజాగా కె.ఎ.పాల్... ఆర్జీవి పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

 

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ అమెరికా నుండి లైవ్ లో రామ్ గోపాల్ వర్మపై అలాగే ఆయన చిత్రీకరించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రపంచ శాంతి కోసం యుద్ధాలను ఆపిన కేఏ పాల్ తన సినిమాని ఆపలేకపోయారు అని వర్మ చేసిన కామెంట్లు పై కే ఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

ఎప్పుడో రిలీజ్ కావల్సిన నీ సినిమా రిలీజ్ కాకుండా ఆపింది ఎవరు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడకు...నేను యుద్ధాలు ఆపిన సందర్భంలో నువ్వే నా పై సినిమాలు చేస్తానని నా దగ్గర కి వచ్చావ్ నా దగ్గర గంటల గంటల గడిపావు సినిమాకు డబ్బులు ఇవ్వలేదని అడ్వాన్స్ ఇవ్వలేదని నిన్ను కాదని అన్నానని ...నీ ఇష్టానుసారంగా సినిమా తీస్తావా దేవుని కోపానికి గురి అవుతావు నాతో పెట్టుకున్న ఏడుగురు ఏమయ్యారో నీకు తెలుసు వాళ్ల పేర్లు కూడా నీకు తెలుసు వాళ్లు ఇప్పుడు లోకంలో లేరు అలాంటి మాపై సెటైర్లు వేస్తావా అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ విధంగా నాతో ప్రవర్తించిన వాళ్ళు చనిపోయారు నువ్వు కూడా అంటూ సంచలన సీక్రెట్ బయట పెడుతూ రాంగోపాల్ వర్మ చచ్చిపోతాడు అన్నట్టుగా వీడియో లో కే ఏ పాల్ వార్నింగ్ ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: