మహేష్ బాబు హీరోగా  రష్మిక కథానాయికగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన లిరిక్స్ కి మంచి స్పందన వస్తుంది. తాజాగా  'సరిలేరు నీకెవ్వరు' లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్, ఫస్ట్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పల్లవి‌తో సాగే ఈ పాట వినసొంపైన ఫ్యామిలీ మెలోడీ‌గా చక్కగా ఉంది. మరోసారి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీని అందించారు.  గ్రామీణ వాతావరణంలో కుటుంబ నేపథ్యంలో సాగిన ఈ పాట మనసుకి హత్తుకునేలా ఉంది.

 

రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా అద్భుతంగా ఉంది. ప్రముఖ పంజాబీ సింగర్, కంపోజర్ బి ప్రాక్ ఈ పాటతో గాయకుడిగా సౌత్ సినీ ఇండస్ట్రీ‌కి పరిచయం అవుతున్నారు. మొదటి పాటతోనే తన గొంతుతో మంత్రముగ్దులను చేశాడు. తాజాగా మహేష్ బాబును రష్మిక మందన్న ఆట పట్టిస్తున్న ‘హి ఈజ్ సో క్యూట్’ పాటను రిలీజ్ చేసారు. ఈ పాటలో మహేష్ బాబును టీజ్‌ చేస్తూ రష్మక డ్యాన్స్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. సాధారణంగా హీరోయిన్లను హీరోలు టీజ్ చేస్తూ ఉండే పాటలు చూస్తుంటాం.. కానీ ఈ సాంగ్ లో మహేష్ బాబునే కన్నడ బ్యూటీ టీజ్ చేస్తున్నట్లు ఉంది. ఓ వైపు టీజ్ చేస్తూనే మరోవైపు తన ప్రియుడి గురించి తెగ పొగిడేస్తున్నట్లు పాట సాగుతుంది.

 

ఈ పాటకు శ్రీమణిసాహిత్యం అందించారు.  ఫిదా మూవీలో ‘వచ్చిండే మెల్లగ వచ్చిండే..’ అంటూ మధుప్రియ పాడిన పాట ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  తాజాగా మరోసారి మధుప్రియ తన గాత్రంతో దుమ్మురేపింది.   రష్మిక బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా మధుప్రియ తన గాత్రంతో ఆకట్టుకుంది.  దేవిశ్రీ  ప్రసాద్ అందించిన ట్యూన్.. దానికి రష్మిక డ్యాన్స్ అధిరిపోయింది.  ఈ పాటలో మహేష్ బాబు వెంట రాజేంద్ర ప్రసాద్.. ఇక రష్మిక వెంట సినియర్ నటి హీరోయిన్ సంగీత, నటి హరి తేజ  కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: