ప్రేక్షకులు అంతా ఈ సంవత్సరo ఎప్పుడు  అయిపోతుందా...... సంక్రాంతి ఏప్పుడు వస్తుందా... అని ఎదురు చూస్తున్నారు.. ఎందుకో తెలుసా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో పందెం పుంజుల్లా రెండు భారీ, పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి.. సిని హీరోలయిన మహేష్ బాబు మరియి అల్లు అర్జున్ బరిలో దిగబోతున్నారు...

 

ఈ రెండు మూవీల మధ్య వార్ రోజు రోజు కి హాట్ హాట్ గా జరుగుతుంది.. కాని ఇప్పుడు ఫ్యాన్స్ కూడా గొడవలోకి ఎంటర్ అయ్యారు. మహేష్ బాబు "సరిలేరు నీకెవ్వరూ" సినిమా అలాగే అల్లు అర్జున్ సినిమా "అలా వైకుంఠపురం" మూవీలు రెండు సంక్రాంతి కి రిలీస్ అవ్వబోతున్నాయి... ఈ రెండు హీరోల ఫ్యాన్స్ ఒకరికొకరు మాటల యుద్ధo మొదలుపెట్టారు..

 

అక్కడితో ఆగకుండా ఒక హీరో పోస్టర్ ఇంకొక హీరో ఫ్యాన్స్ చించేయడంలాంటివి కూడా జరుగుతున్నాయి.. తాజాగా వైజాగ్ లో ఇలాంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంది.. వైజాగ్ లోని సంగం సినిమా థియేటర్ వద్ద ఇరువురి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేసారంట. ఉదయం సరిలేరు నీకెవ్వరూ పోస్టర్ పెడితే మధ్యాహ్నం అలా వైకుంఠ పురం మూవీ పోస్టర్స్ ఉంటే సాయంత్రానికి అసలు ఏ పోస్టర్ కూడా ఉండడంలేదట...

 


ముందుగా మహేష్ ఫ్యాన్స్ 'సరిలేరు నీకెవ్వరు' బ్యానర్ కట్టారు. అయితే దానిపై ఆ సినిమా టీజర్‌లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్..''అన్ని సంక్రాంతులకు అల్లుల్లోస్తారు. కానీ ఈ సంక్రాంతికి మొగుడొస్తునాడు'' అని ముద్రించారు. దీంతో ఈ పోస్టర్ చూసిన బన్నీ అభిమానులు ఆవేశంతో.. అదే పోస్టర్ స్థానంలో అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' పోస్టర్ పెట్టారు....

 

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గకుండా పోస్టర్ లో "ఈ సంక్రాంతి కి వచ్చేది మొగుడు కాదు మగాడు" అని బ్యానర్ పెట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు.. మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోయి బన్నీ పోస్టర్ ని చించేశారు..


ఇద్దరి సినిమా హీరోల మధ్య ఫ్యాన్స్ ఎంటర్ అయ్యి గొడవలదాకా వచ్చారు ఇది ఎక్కడ దాక వెళుతుందో చూడాలి.. "సరిలేరు నీకెవ్వరూ "సినిమా జనవరి 11 న విడుదల కానుంది.. అలాగే "అలా వైకుంఠపురం"సినిమా జనవరి 12 న రిలీజ్ కానుంది.. ఒక రోజు గ్యాప్ తో రెండు భారీ సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి... సంక్రాంతి బరిలో దిగి పందెం కోడిలా ఉండే సినిమా ఎదన్నది తెలియాలంటే సంక్రాంతి దాక ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: